Moon Temperature: లాక్డౌన్ ఎఫెక్ట్.. చంద్రుని ఉపరితలంపై తగ్గిన ఉష్ణోగ్రత..!
- కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలు
- దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా
- లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని కొత్త అధ్యయనం వెల్లడి
- దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో.. లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా మారిందని తెలిపింది.
Virat Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
చంద్రుని ఉపరితలంపై పాదరసం 8 నుండి 10 కెల్విన్ వరకు పడిపోయింది..
ఏప్రిల్-మే 2020లో కఠినమైన లాక్డౌన్ సమయంలో చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రత 8 నుండి 10 కెల్విన్లకు పడిపోయిందని భారతీయ శాస్త్రవేత్తలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన ఈ నివేదిక ప్రకారం.. శాస్త్రవేత్తలు 2017 నుండి 2023 వరకు చంద్రుని యొక్క వివిధ భాగాలపై ఉష్ణోగ్రతను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో.. లాక్డౌన్ సమయంలో ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు కనుగొన్నారు. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్ఎల్) శాస్త్రవేత్తలు కె దుర్గా ప్రసాద్, జి అంబిలి బృందం నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) సహాయంతో చంద్రుని ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలో ఈ మార్పును నమోదు చేసింది. PRL డైరెక్టర్ అనిల్ భరద్వాజ్ దీనిని ఒక ముఖ్యమైన, కొత్త పరిశోధన అని పిలిచారు. దీనిలో మానవ కార్యకలాపాల తగ్గింపు ప్రభావం భూమికి మాత్రమే పరిమితం కాకుండా చంద్రునిపైకి కూడా చేరిందని స్పష్టమైంది.
Nirmala sitharaman: ఎలక్టోరల్ బాండ్ల కేసులో నిర్మలమ్మకు ఊరట.. విచారణపై స్టే
శాస్త్రవేత్తల ప్రకారం.. లాక్డౌన్ కారణంగా భూమి యొక్క కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గింది. దీని కారణంగా వాతావరణంలో వేడి, శక్తి ప్రవాహం కూడా తగ్గింది. ఈ కారణంగా, చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రత తగ్గుదల నమోదైంది. ఈ అధ్యయనం పర్యావరణ మార్పుల యొక్క లోతును అర్థం చేసుకోవడంలో తమకు సహాయపడటమే కాకుండా, మన కార్యకలాపాలు మన గ్రహానికి మించిన ప్రభావాలను కలిగి ఉంటాయని రుజువు చేస్తుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?