Bombay High Court: ఉద్ధవ్ ఠాక్రేకి మళ్లీ షాక్.. ఏక్‌నాథ్ షిండే గ్రూపు పిటిషన్‌పై హైకోర్టు నోటీసులు జారీ

Uddav

Uddav

14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శివసేనకు నోటీసులు జారీ చేసింది. జూన్ 2022లో చీలిక తర్వాత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో షిండే గ్రూప్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Film Nagar: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో భర్తను చంపి పరార్..

అనర్హత వేటు వేయాలని శివసేన రెండు వర్గాలు డిమాండ్ చేశాయి. 2022లో పార్టీ చీలిక తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. షిండేతో సహా అధికార వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే బృందం పిటిషన్‌లో డిమాండ్ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షిండే డిమాండ్ చేశారు. అయితే, స్పీకర్ రాహుల్ నార్వేకర్ జనవరి 10న తన తీర్పులో ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే క్యాంపులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.

MLA Rakshana Nidhi: టీడీపీతో టచ్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రాజీనామాకు రెడీ..

2018లో థాకరే నాయకత్వ నిర్మాణంలో చేసిన మార్పులను నార్వేకర్ తిరస్కరించారు. అవి 1999 శివసేన రాజ్యాంగానికి అనుగుణంగా లేవని, ఈ సవరణలకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద ఎలాంటి రికార్డులు లేవని చెప్పారు. జూన్ 21న పార్టీలో ప్రత్యర్థి వర్గం ఏర్పడిన తర్వాత చట్టబద్ధంగా ఎన్నికైన చీఫ్‌విప్‌గా కొత్త చీఫ్‌విప్‌ భరత్‌ గొగావాలే నియమితులవుతారు కాబట్టి, అప్పటి చీఫ్‌విప్‌ సునీల్‌ ప్రభు పదవిలో కొనసాగాలనే కోరికను ప్రతిబింబించలేదని స్పీకర్ అన్నారు.