Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memantha Siddham Bus Yatra: పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం విదితమే.. మూడో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. నేడు కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగనుంది.. కర్నూలు జిల్లా పెంచికలపాడులో రాత్రి బస చేశారు సీఎం జగన్.. ఈ రోజు ఉదయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక, ఈ రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర.. రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది.. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకోనున్నారు..
Read Also: CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరు వరకు బస్సు యాత్ర సాగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్.. ఈ సభ ముగించుకుని.. అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్కి చేరుకోనున్నారు.. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి బస చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ.. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.. కాగా, మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న బహిరంగ సభల వేదికగా.. పొత్తులు హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!