Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memantha Siddham Bus Yatra: పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం విదితమే.. మూడో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. నేడు కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగనుంది.. కర్నూలు జిల్లా పెంచికలపాడులో రాత్రి బస చేశారు సీఎం జగన్.. ఈ రోజు ఉదయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక, ఈ రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర.. రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది.. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకోనున్నారు..
Read Also: CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరు వరకు బస్సు యాత్ర సాగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్.. ఈ సభ ముగించుకుని.. అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్కి చేరుకోనున్నారు.. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి బస చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ.. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.. కాగా, మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న బహిరంగ సభల వేదికగా.. పొత్తులు హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం