PLDT 2023 : పీడియాట్రిక్ కాలేయ మార్పిడిపై తొలి అంతర్జాతీయ సింపోజియం
హైదరాబాదులో జరుగుతున్న పీడియాట్రిక్ లివర్ డిసీజ్ మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్పై అంతర్జాతీయ సింపోజియంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు హాజరయ్యారు. ఈ సింపోజియం పిల్లల కాలేయ వ్యాధి మరియు కాలేయ మార్పిడి రంగంలో తాజా పురోగతిపై చర్చించడం మరియు జ్ఞానాన్ని మార్పిడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో కాలేయ వ్యాధిగ్రస్తులు ఎక్కువమంది ఉన్నారు. జనాభాలో పది శాతం మంది ఈ వ్యాధికి ప్రభావితమయ్యారు. పిల్లలలో కూడా కాలేయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. పిల్లల జనాభాలో కాలేయ మార్పిడి అవసరం పెరుగుతోంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ హెపటాలజీ అండ్ న్యూట్రిషన్ (ISPGHAN) ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 5,000 మంది పిల్లలకు కాలేయ మార్పిడి అవసరం ఏర్పడుతోంది. కానీ దాత అవయవాలు మరియు వనరుల పరిమిత లభ్యత కారణంగా వారిలో కొంత భాగం మాత్రమే ప్రక్రియను అందుకుంటున్నారు.
Also Read : MLCs Meets CM YS Jagan: సీఎంను కలిసిన నూతన టీచర్ ఎమ్మెల్సీలు.. జగన్ అభినందనలు..
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
హైదరాబాద్లోని లివర్ ప్యాంక్రియాస్ ఫౌండేషన్, PACE ఆసుపత్రులు LTSI, TS-ISG, PATS, OGH మరియు గాంధీ హాస్పిటల్లతో కలిసి పిల్లలలో పెరుగుతున్న కాలేయ వ్యాధి భారాన్ని పరిష్కరించేందుకు మరియు పిల్లల కాలేయ వ్యాధి నిర్ధారణ, చికిత్స మరియు నిర్వహణను మెరుగుపరచడానికి ఈ సింపోజియం నిర్వహించబడింది. హైదరాబాద్లోని పేస్ హాస్పిటల్స్ కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు కాలేయ మార్పిడి సర్జన్ డాక్టర్ ఫణి కృష్ణా ప్రకారం… ఈ సింపోజియంలో పీడియాట్రిక్ లివర్ డిసీజ్ మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన వివిధ అంశాలపై అనేక సెషన్లు ఉన్నాయి. అవి జీవక్రియ కాలేయ వ్యాధులు, వైరల్ హెపటైటిస్, కాలేయ కణితులు, తీవ్రమైన కాలేయ వైఫల్యం మరియు కాలేయ మార్పిడి. సెషన్లకు ప్రముఖ అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణులు డాక్టర్. శివ్ కుమార్ సరిన్, డాక్టర్ మహమ్మద్ రేలా, డాక్టర్ సుభాష్ గుప్తా, డాక్టర్ నీలం మోహన్, డాక్టర్ అమిత్ మేడియో, డాక్టర్ పారిజాత్ త్రిపాఠి, డాక్టర్ అనిల్ ధావన్, డాక్టర్ మారియో కసహార, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ భటానగర్, డాక్టర్ ఆశిష్ బావ్డేకర్ తమ అనుభవాలను పంచుకున్నారు.
Also Read : Karthikeya 2: నిఖిల్ రేంజ్ మామూలుగా లేదుగా!
డాక్టర్ మధుసూదన్( ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు కాలేయ మార్పిడి సర్జన్ OGH మరియు పేస్ హాస్పిటల్) భారతదేశంలోని పీడియాట్రిక్ జనాభాలో కాలేయ మార్పిడి యొక్క సవాళ్ల గురించి మాట్లాడారు. పిల్లలలో కాలేయ వ్యాధి గురించి మరింత అవగాహన పెంపొందించేందుకు విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు. డాక్టర్ సుభాష్ గుప్తా…. చివరి దశ కాలేయ వ్యాధితో బాధపడుతున్న పిల్లలలో కాలేయ మార్పిడి చేయడం గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. సరైన దాతను ఎంచుకోవడం, సరైన సర్జరీ పద్ధతిని నిర్ధారించడం మరియు పిల్లలకు ఉత్తమ ఫలితాలను అందించడానికి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ను అందించడం వంటి వాటి ప్రాముఖ్యత గురించి చర్చించారు. సింపోజియం… యువ పరిశోధకులకు తమ పనిని మౌఖిక ప్రదర్శనల ద్వారా ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందించింది.
Also Read : Gandra Venkataramana : గోబెల్స్కు వారసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలు
పీడియాట్రిక్ లివర్ డిసీజ్ మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన వివిధ అంశాలపై అనేక పరిశోధన అధ్యయనాలు ప్రదర్శించబడ్డాయి. ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న పోకడలు మరియు సవాళ్లను హైలైట్ చేస్తూ హైదరాబాద్లోని సీనియర్ కాలేయ మార్పిడి సర్జన్ డాక్టర్ మధుసూధన్ మాట్లాడారు. దేశంలో పిల్లల కాలేయ వ్యాధి మరియు కాలేయ మార్పిడి భవిష్యత్తుపై చర్చాగోష్టి జరిగింది. పిల్లలలో పెరుగుతున్న కాలేయ వ్యాధి భారాన్ని పరిష్కరించడానికి పరిశోధన మరియు మౌలిక సదుపాయాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని, అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, విధాన రూపకర్తలు మరియు రోగుల సమూహాలతో కూడిన సహకార విధానాన్ని నిపుణులు నొక్కి చెప్పారు. దేశంలోని పిల్లలలో కాలేయ వ్యాధుల నిర్ధారణ, చికిత్స మరియు నిర్వహణను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా ఈ సింపోజియంను అభివర్ణించవచ్చు.
Also Read : MLA Vivek : అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారు
దేశంలో పీడియాట్రిక్ కాలేయ వ్యాధి మరియు కాలేయ మార్పిడి విషయంలో ముందుకు వెళ్లే మార్గాన్ని చర్చించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులకు వారి విజ్ఞానం, అనుభవాలను పంచుకోవడానికి ఈ సింపోజియం ఒక వేదికను అందించింది. పరిశోధన మరియు అవస్థాపనలో ఎక్కువ అవగాహన…విద్య మరియు పెట్టుబడితో దేశంలో ఎక్కువ మంది పిల్లల ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి విధానాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయని డాక్టర్ గోవింద్ వర్మ (సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు ఆర్గనైజింగ్ చైర్మన్, PLDT -23) ఆశిస్తున్నారు. నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ మరియు సీఈఓ రాజీవ్ నన్నపనేని ప్రారంభోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా విచ్చేశారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల కాలేయ వ్యాధులు మరియు మార్పిడిపై పోరాటాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఇటువంటి ప్రయత్నాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!