Nizamabad: ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ అధికారి.. భారీ మొత్తంలో నగదు సీజ్
- మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం
- ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై..
- రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- భారీగా నగదు.. బంగారు ఆభరణాలు.. ఆస్తులు స్వాధీనం
- మొత్తం రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులు సీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. అంత మొత్తం డబ్బును లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాల్ని తీసుకొచ్చారు. అలాగే.. బంగారు ఆభరణాలు, ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు చేపట్టారు.
Read Also: GOOD BAD UGLY: కీలక షెడ్యూల్ లో గుడ్ బాడ్ అగ్లీ
Also Read
మొత్తంగా ఏసీబీ సోదాల్లో రూ. 2,93,81,000 నగదు పట్టుబడగా.. నరేందర్ భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షలను ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51 తులాల బంగారు ఆభరణాలు, కోటి 98 లక్షలు విలువ చేసే ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్ను హైదరాబాద్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. నరేందర్పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
Read Also: Salaar 2: ‘సలార్ 2’ సంగతేంటి బాసూ? ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..