LIC: రైలు ప్రమాద బాధితుల కోసం LIC కీలక నిర్ణయం.. బీమా ఈజీగా క్లైయిమ్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC: దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెద్ద అడుగు వేసింది. ఈ ప్రమాదంలో బాధితులకు బీమా పాలసీని క్లెయిమ్ చేసే విధానాన్ని ఎల్ఐసీ సులభతరం చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో రైలు ప్రమాదాల బాధితులకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో ఎల్ఐసీ పలు రకాల ఉపశమనాలను ప్రకటించింది.
Read Also:Botsa Satyanarayana: ఎన్నికలొస్తే.. పగటి వేషాల్లాగా చంద్రబాబు రంగులు మారుస్తాడు
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
LIC ప్రకటన ప్రకారం, రైలు ప్రమాద బాధితులు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వారి LIC యొక్క బీమా పాలసీ, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పాలసీల క్లెయిమ్ ప్రక్రియను సరళీకృతం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే, పోలీసు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, ఏదైనా కేంద్ర శాఖ జారీ చేసిన మృతుల జాబితా మాత్రమే ప్రమాద బాధితులకు బీమా క్లెయిమ్ చేయడానికి మరణ ధృవీకరణ పత్రంగా అంగీకరించబడుతుంది. అంటే, ఈ మరణించిన వారి బంధువులు బీమా క్లెయిమ్ చేయడానికి రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఎల్ఐసీ ప్రత్యేక హెల్ప్ డెస్క్
ఇది మాత్రమే కాదు, కోరమాండల్ రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఎల్ఐసి ప్రత్యేక హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్ను ప్రారంభించింది. క్లెయిమ్ సంబంధిత విచారణలు డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో LIC కార్యాలయంలో పరిష్కరించబడతాయి. అదే సమయంలో, దావా కోసం దరఖాస్తు చేసుకున్న బంధువులకు పూర్తి సహాయం అందించబడుతుంది. బీమా హోల్డర్లందరికీ చేరువయ్యేందుకు, క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగవంతం చేయడానికి కృషి చేయబడుతుంది.
Read Also:Cleaver Thief : సినిమా స్టైల్లో చోరీ.. రైలు బాత్రూం నుంచి తెలివిగా పరార్
288 మంది మృతి, 1,100 మందికి గాయాలు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఈ ప్రమాదంపై ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 288 మంది చనిపోయారు. సుమారు 1,100 మంది గాయపడ్డారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, SMVT బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!