Karnataka Cabinet Expansion: ఢిల్లీకి చేరిన కర్ణాటక క్యాబినేట్ విస్తరణ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రచ్చ మొదలైంది. నిన్నటి నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 19న కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైనప్పటికీ, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల కారణంగా ఆ విషయం కుదరలేదు. ఆ తర్వాత బంతి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టులోకి వచ్చింది.
రాష్ట్ర కొత్త సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో ప్రస్తుతం 8 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతం కనీసం 25 మంది మంత్రులు కావాల్సి ఉంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్.. ఇద్దరూ తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య క్యాబినెట్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో.. ప్రభుత్వాన్ని నడపడంలో తమ ఆధిపత్యం చెలాయించే వీలుంటుందనేది వారి భావన.
Also Read
Read Also: Adipurush: జై శ్రీరామ్ సంచనలం మర్చిపోక ముందే “రామ్ సియా రామ్” రిలీజ్…
బుధవారం నుంచి ఢిల్లీలో మకాం వేసిన డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఖర్గేతో భేటీకి ముందు సీఎం సిద్ధరామయ్య ఆయన నివాసానికి చేరుకుని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు.
కొత్త మంత్రులకు లభించని ఫోర్టు పోలియో
మే 20న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల శాఖల విభజన జరగలేదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు. కల్బుర్గి జిల్లా చితాపూర్ స్థానం నుంచి గెలిచిన ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Read Also: Sweet Mangoes: వైరల్ అవుతున్న మ్యాంగో మ్యాన్.. నవీన్ ఉల్ హక్ పై కోహ్లీ ఫ్యాన్స్ రివెంజ్..!
అసెంబ్లీ స్పీకర్గా యూటీ ఖాదర్
కేబినెట్ మంత్రుల కుమ్ములాటల మధ్య బుధవారం కర్ణాటక శాసనసభ స్పీకర్గా మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూటీ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాదర్ కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఖాదర్ను స్పీకర్గా చేసిన తర్వాత, సీఎం సిద్ధరామయ్య ఆయనను ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడిగా అభివర్ణించారు. ఏ పార్టీ పట్ల పక్షపాతం లేకుండా పనిచేయడానికి తన లౌకిక మనస్తత్వం దోహదపడుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!