Sunkara Padmasree: మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు!
- అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా?
- చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?
- కృష్ణంరాజు వాగితే.. కొమ్మినేని వెటకారాలు ఆడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?.. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.
‘రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా?. మళ్లీ మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారు. ఓ చానల్లో కృష్ణంరాజు వాగితే.. కొమ్మినేని వెటకారాలు ఆడారు. వాటిని సోషల్ మీడియాలో కట్ చేయకుండా వీడియోలు పెట్టారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నా.. కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?. రాజధాని మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని అరెస్టు చేయరా?’ అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.
Also Read
- Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Also Read: Nithin : ‘తమ్ముడు’ మూవీ నుంచి ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ లుక్ ..
‘రాష్ట్ర హోంమంత్రి, మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ ఎందుకు మాట్లాడటం లేదు?. మహిళల క్యారెక్టర్ కించపరిచిన వారినే అరెస్టు చేయలేకపోతే.. ఇక రాష్ట్రంలో మహిళలకు మీరేం న్యాయం చేయగలరు. కొమ్మినేని, కృష్ణంరాజులు ఇద్దరినీ అరెస్టు చేయాలి. ప్రభుత్వం చేతకాని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు స్పందించాలి. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి’ అని సుంకర పద్మశ్రీ కోరారు. ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
-
Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
-
Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
-
Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!