Congress: మహారాష్ట్రలో కాంగ్రెస్కు షాక్.. కీలక పదవికి ఆరిఫ్ ఖాన్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఆరిఫ్ (నసీం) ఖాన్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపెయినర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. తదుపరి దశల్లో జరగబోయే స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన గుడ్బై చెప్పారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. మహారాష్ట్రలో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్యాయమైన నిర్ణయంతో తాను కలత చెందినట్లుగా లేఖలో ఆరిఫ్ (నసీం) ఖాన్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో భాగంగా ఆయా పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గానికి సీటు లభించలేదు. దీంతో ఆయన అలకబూనారు.
ఇది కూడా చదవండి: Nama Nageswara Rao: కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోయారు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
పదవి నుంచి వైదొలగడానికి గల కారణాలను లేఖలో పంచుకున్నారు. నాల్గవ దశ సార్వత్రిక ఎన్నికలకు తన పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మూడు, నాలుగు, ఐదవ దశల్లో మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయబోమని ఆయన తెలియజేశారు. మహారాష్ట్రలో MVA (మహా వికాస్ అఘాడి) మరియు కాంగ్రెస్ ఒక్క ముస్లిం అభ్యర్థిని నామినేట్ చేయకూడదని తీసుకున్న నిర్ణయం తనను కలతకు.. నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. కనీసం ఒక్క ముస్లిం అభ్యర్థి అయినా నామినేట్ అవుతారని ఆశించిన అనేక ముస్లిం సంస్థలు, నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Karimnagar: కరీంనగర్ లో 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
ఇదిలా ఉంటే గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను ఖాన్ శ్రద్ధగా నిర్వర్తించారు. ప్రస్తుతం ముస్లిం సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లుగా సమాచారం.
మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికి రెండు దశల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Ragisn
#WATCH | Congress leader Mohammed Arif (Naseem) Khan says, " In Maharashtra, there is a lot of anger in people and organisations of minority communities…because there is not a single candidate from minority communities in 48 Lok Sabha seats…I am also angry because it has been… https://t.co/bBzJ0nm9zF pic.twitter.com/hGUC6HCUAj
— ANI (@ANI) April 26, 2024
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!