Jagga Reddy: బీజేపీ ఎంపీ లక్ష్మణ్పై ఫైర్ అయిన జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని లక్ష్మణ్ అనడం ఆయన అవగాహన రాహిత్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావచ్చు.. బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్ఎస్ నుంచి మనసుమార్చుకుని 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా?, అప్పుడు మా బలం 90 కదా? సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెబుతున్నా?, కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసగాళ్లకు మోసగాళ్లు బీజేపీ నేతలు. మోసాలు చేయడంలో బీజేపీది ఇంటర్నేషనల్లో మొదటి ర్యాంక్. మోడీ ఇచ్చిన హామీలపై మా ఎంపీ అనిల్తో చర్చకు రండి. బీజేపీ నేతలు శివలింగం మీద పాములాంటి వాళ్లు.. అందుకే ప్రజలు మొక్కుతున్నారు. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే పడుతుంది.’’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Raai Laxmi: అబ్బా.. రత్తాలు కొత్త లుక్ అదిరిపోయింది..
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘‘గతంలో ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ పోలీసులను వాడుకునేది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల కమిషన్కి సహకారం ఇచ్చింది . ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.. ఈ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది, సీఎం రేవంత్రెడ్డిది. సోమవారమే ఎన్నికలు అయిపోయాయి .. ప్రెస్మీట్ ఎందుకులే అనుకున్నా.. కానీ బీజేపీ లక్ష్మణ్ అనవసరంగా మాట్లాడారు. ప్రజలు.. అంతా రిలాక్స్ అయ్యారు. కొంపలు మునిగినట్టు.. లక్ష్మణ్ మాట్లాడటం సరికాదు. లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీనా.. జోతిష్యం చెబుతున్నారా..? మూడు నెలల్లో ఏదో జరుగుతుంది అని మాట్లాడటం అవసరమా? ఆగస్టులో కాంగ్రెస్ సంక్షోభంలో పడుతుంది అని అంటున్నారు. ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. ఆగస్టు సంక్షోభం అనేది.. ఒట్టి మాట. కాంగ్రెస్కి 64 మంది ఎమ్మెల్యేలతో అధికారం ఇచ్చారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు.. బస్సులో మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారు.. గ్యాస్ 500కి వస్తుంది. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం చెప్పారు.’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Snacks: 5 రూపాయిల కుర్కురే కొనివ్వలేదని భర్తను వదిలేసిన అర్ధాంగి
తాజావార్తలు
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!