Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: గత కొంతకాలంగా ఢిల్లీలోని తన చారిత్రక ప్రధాన కార్యాలయం ’24 అక్బర్ రోడ్’ విషయంలో సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ బంగ్లాలో మరికొన్ని నెలల పాటు కొనసాగేందుకు పార్టీకి అనుమతి లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలతో జరిగిన అనధికారిక చర్చల అనంతరం, కాంగ్రెస్కు ఈ బంగ్లాలో ఉండేందుకు మరికొంత కాలం గడువు లభించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇది ఒక ‘టైమ్-బైయింగ్’ ఏర్పాటుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
- Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
- Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
24 అక్బర్ రోడ్ను తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి కాంగ్రెస్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. నిబంధనల ప్రకారం.. ఈ బంగ్లాను ఎవరో ఒకరు సీనియర్ నాయకుడి పేరు మీద (మాజీ ముఖ్యమంత్రులు లేదా మాజీ కేంద్ర మంత్రుల కేటగిరీలో) కేటాయించేలా ప్లాన్ చేస్తోంది. ఈ జాబితాలో అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ వంటి హేమాహేమీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రధాన కార్యాలయానికి ఉపశమనం లభించినప్పటికీ, 5 రైసినా రోడ్లో ఉన్న యూత్ కాంగ్రెస్, NSUI కార్యాలయాలపై మాత్రం ముప్పు పొంచి ఉంది. అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి రావచ్చనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
సుప్రీంకోర్టు తీర్పుతో బిగ్ రిలీఫ్..
మరోవైపు, 1970ల నాటి పార్టీ విభజన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు పెద్ద ఊరటనిచ్చింది. పాత ఆస్తులపై కాంగ్రెస్కే ప్రాథమిక హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రభావం జంతర్ మంతర్ వద్ద ఉన్న పాత ప్రధాన కార్యాలయంపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే, కొన్ని విభాగాలను జంతర్ మంతర్ భవనంలోకి మార్చాలని పార్టీ యోచిస్తోంది. కర్ణాటకతో సహా దేశంలోని పలు చోట్ల కోర్టు తీర్పు ఆధారంగా తమ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
-
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
-
Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!