Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: గత కొంతకాలంగా ఢిల్లీలోని తన చారిత్రక ప్రధాన కార్యాలయం ’24 అక్బర్ రోడ్’ విషయంలో సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ బంగ్లాలో మరికొన్ని నెలల పాటు కొనసాగేందుకు పార్టీకి అనుమతి లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలతో జరిగిన అనధికారిక చర్చల అనంతరం, కాంగ్రెస్కు ఈ బంగ్లాలో ఉండేందుకు మరికొంత కాలం గడువు లభించింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇది ఒక ‘టైమ్-బైయింగ్’ ఏర్పాటుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
24 అక్బర్ రోడ్ను తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి కాంగ్రెస్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. నిబంధనల ప్రకారం.. ఈ బంగ్లాను ఎవరో ఒకరు సీనియర్ నాయకుడి పేరు మీద (మాజీ ముఖ్యమంత్రులు లేదా మాజీ కేంద్ర మంత్రుల కేటగిరీలో) కేటాయించేలా ప్లాన్ చేస్తోంది. ఈ జాబితాలో అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ వంటి హేమాహేమీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రధాన కార్యాలయానికి ఉపశమనం లభించినప్పటికీ, 5 రైసినా రోడ్లో ఉన్న యూత్ కాంగ్రెస్, NSUI కార్యాలయాలపై మాత్రం ముప్పు పొంచి ఉంది. అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి రావచ్చనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
సుప్రీంకోర్టు తీర్పుతో బిగ్ రిలీఫ్..
మరోవైపు, 1970ల నాటి పార్టీ విభజన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు పెద్ద ఊరటనిచ్చింది. పాత ఆస్తులపై కాంగ్రెస్కే ప్రాథమిక హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రభావం జంతర్ మంతర్ వద్ద ఉన్న పాత ప్రధాన కార్యాలయంపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే, కొన్ని విభాగాలను జంతర్ మంతర్ భవనంలోకి మార్చాలని పార్టీ యోచిస్తోంది. కర్ణాటకతో సహా దేశంలోని పలు చోట్ల కోర్టు తీర్పు ఆధారంగా తమ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!