NTV Telugu Site icon

AP Crime: ఆటోలో కూర్చునే విషయంలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య

Crime

Crime

AP Crime: ఎప్పుడు..? ఎలా? ప్రాణాలు పోతాయో తెలియదు అంటారు…? కానీ, ఇప్పుడు ఎప్పుడు..? ఎవరు? ఎలా ప్రాణాలు తీస్తారో కూడా తెలియడం లేదు.. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసుకోవడం వరకు వెళ్తున్నారు.. తాజాగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో దారుణం చోటుచేసుకుంది… ఓ చిన్నపాటి గొడవ చివరకు హత్యకు దారితీసింది. ఈ దాడిలో ఆత్మకూరు కు చెందిన ఖాజావలి అనే యువకుడి ఛాతిపై ఫరూక్ అనే వ్యక్తి కత్తితో పొడవటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

Read Also: CM Revanth Reddy: నేడు మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఏటీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన ఫరూక్.. కిష్టాపురం గ్రామానికి చెందిన మూర్తుజా అనే ఇద్దరూ కలిసి టాటా ఏసీ ఆటోలో సుదూర ప్రాంతాలకు వెళ్లి కవ్వ బన్ను వ్యాపారం చేస్తుంటారు.. అయితే రోజులాగానే నిన్న కూడా వ్యాపారం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆటో క్యాబిన్ లో కూర్చునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. అనంతరం ఇద్దరూ ఎవరింటికి వారు చేరుకున్నారు. మళ్లీ కాసేపటికి ఫరూక్ మద్యం సేవించి మూర్తుజాకి ఫోన్ చేసి బూతులు తిట్టడంతో ఆత్మకూరు లోని తన మిత్రుడు అయినటువంటి ఖాజావలి మరో నలుగురుతో కలిసి కురుకుంద గ్రామానికి వెళ్లి ఫరూక్ తో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఫరూక్ కత్తితో ఖాజావలి అనే యువకుడి ఛాతిపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఫరూక్ పరారీలులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.