Delhi College Students: ఢిల్లీ కాలేజీ విద్యార్థిపై దాడి.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ..!
- ఢిల్లీ యూనివర్శిటీలోని శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజీలో.
- రెండు విద్యార్థి సంఘాలు ఘర్షణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi College Students: ఢిల్లీ యూనివర్శిటీలోని శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజీలో ప్రిన్సిపాల్ కార్యాలయం బయట ఆదివారం నాడు 2 విద్యార్థి సంఘాలు ఘర్షణ పడ్డారు. ఫలితంగా., ఓ విద్యార్థి తలపాగా కింద పడిపోయింది. కళాశాల మాతృ సంస్థ ఢిల్లీ సిక్కు గురు ద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27న ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో తాము పాల్గొనబోమని కళాశాల అధికారులు చెప్పడంతో నిరసనల నేపథ్యంలో విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఇక ప్రిన్సిపాల్ కార్యాలయం బయట విద్యార్థుల సమూహం నిలబడి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత, ఎర్రటి తలపాగా ధరించిన విద్యార్థిని అకస్మాత్తుగా కొంతమంది విద్యార్థులు లాగి కొట్టారు.
Gold Rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
దాడి సమయంలో విద్యార్థి తలపాగా పడిపోవడంతో కొందరు విద్యార్థులు జోక్యం చేసుకున్నారు. వారిలో ఒకరు తలపాగాను ఎత్తుకుని, దానిని ధరించిన అబ్బాయికి ఇచ్చారు. మిగిలిన విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయం బయట నిలబడి ఉన్నారు. వారిలో కొందరు కార్యాలయ తలుపు తెరిచిన అధికారులతో మాట్లాడాడారు. కొంతసేపటి తర్వాత కొందరు విద్యార్థులు కాలేజీ గేటు వైపు పరుగులు తీశారు. ఈ గొడవలో తలపాగా పడిపోయిన విద్యార్థి ఘటనపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ సెక్షన్లు 299 (మత భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశపూర్వక చర్య), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 351(2) (నేరపూరిత బెదిరింపు), 3(5) లపై కేసు నమోదు చేసారు. అంతకుముందు, కళాశాల ప్రిన్సిపాల్ గుర్మోహిందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిపాలనకు లేఖ రాస్తూ, కళాశాల తన స్వంత విద్యార్థి ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్పారు. డీఎస్జీఎంసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. DSGMC నాలుగు ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలను నియంత్రిస్తుంది. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల, శ్రీ గురునానక్ దేవ్ ఖల్సా కళాశాల, శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇవన్నీ DUSUతో అనుబంధంగా ఉన్నాయి.
MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..
అయితే, మాతా సుందరి కాలేజ్ ఫర్ ఉమెన్, DSGMC పరిధిలోని మరొక కళాశాల DUSUతో అనుబంధించబడలేదు. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల సొంత ఎన్నికలకు స్టాఫ్ అడ్వైజరీ కమిటీ నామినేట్ చేసే ఆఫీస్ బేరర్లు ఉంటారని తెలిపారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. RSS అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), కాంగ్రెస్ సంబంధించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రెండింటికి చెందిన విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలియజేయడానికి కళాశాలలో సమావేశమయ్యారు. DUSU నుండి DSGMC కాలేజీలను విడదీయడాన్ని సవాలు చేస్తూ ABVP కూడా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!