Collectors Conference: కలెక్టర్ల కాన్ఫరెన్స్ తాజా తేదీలు ఇవే.. దిశానిర్దేశం చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం
- మారిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ తేదీలు..
- ఈ నెల 11, 12 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్..
- దిశానిర్ధేశం చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collectors Conference: ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చసి ఆరు నెలలు పూర్తవుతోంది. అయితే, ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు.. తమ టార్గెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తోన్న కూటమి ప్రభుత్వం.. మరిన్ని భవిష్యత్ లక్ష్యాలను ఫిక్స్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే కాగా.. మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది..
Read Also: Jaggareddy: సోనియా గాంధీ బర్త్డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
Also Read
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వివిధ శాఖల వారీగా కాన్ఫరెన్స్లో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.. ఇక, రెండో రోజు ముగింపు సమయంలోనూ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆరు నెలల పాలన పూర్తవుతున్న వేళ.. కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.. ఈ సారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలను సిద్ధం అవుతున్నారట.. ఈ సారి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట.. వీటి అమలుపైనా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖల్లో ఈ 6 నెలల కాలంలో వచ్చిన మార్పు.. తీసుకురావాల్సిన మార్పుల పైన చర్చించి కీలక సూచనలు చేయనున్నారు. వ్యవసాయం, నీటి పారుదల అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారట.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా.. భూముల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో భూ రికార్డుల పరిశీలన.. ఫిర్యాదుల పరిష్కారంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు..
తాజావార్తలు
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!