CM YS Jagan: ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించనున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొని.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: AP Bandh: అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్కు పిలుపు