వరుసగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక.. మరో పథకానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.. రేపు వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.. రేపు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం” ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న తపనతో.. ఏటా రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్ జగన్ సర్కార్.
ఇప్పుడు అందిస్తున్న రూ. 536.77 కోట్లతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం ఆర్థిక సాయం రూ. 2,029 కోట్లు… ఒక్కో పేద కాపు అక్క చెల్లెమ్మకు నాలుగేళ్ళ కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000గా ఉంది.. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ. 400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 52 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ. 39,247 కోట్ల (DBT + Non DBT) లబ్ధి చేకూర్చింది..
కాగా, కాపుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొంది.. కాపుల సంక్షేమానికి మనందరి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వివరాలు (డీబీటీ మొత్తం) లబ్ధిదారులు 61,36,196, లబ్ధి రూ. కోట్లలో 22,333, నాన్ డీబీటీ మొత్తం లబ్ధిదారులు 15,64,433, లబ్ధి రూ. కోట్లలో 16,914, మొత్తం (డీబీటీ, నాన్ డీబీటీ) లబ్దిదారులు 77,00,628, లబ్ధి రూ. కోట్లలో 39,247 చేసింది ప్రభుత్వం.