YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ కానుక.. నేడు కాకినాడకు సీఎం.. మళ్లీ గెలిస్తే రూ.4వేల పెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Pension Kanuka: గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతీ ఏడాది పెన్షన్ పెంచుతూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ఉంటూ పెన్షన్ వచ్చారు.. ఇప్పటి వరకు పెన్షన్ రూ.2,750గా వస్తుండగా.. ఇవాళ్టి నుంచి అది రూ.3 వేలకు పెరగనుంది.. నేడు కాకినాడలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, కాకినాడ పర్యటన కోసం ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్..
Read Also: Raa Kadali Ra: నేటి నుంచి ‘రా కదలి రా!’
Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
1వ తేదీ జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా రూ.23,556 కోట్లు ఖర్చుచేయనుంది ఏపీ ప్రభుత్వం.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి రూ. 83,526 కోట్ల పైగానే ఉంది.. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేస్తున్న విషయం విదితమే.. ఇక, పెన్షన్ పెంపు ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి చేకూరనుంది. అసలు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత పెన్షన్ ఎలా పెంచుతూ పోయారన్న వివరాల్లోకి వెళ్తే.. జులై 2019 నుంచి పెన్షన్ను రూ.2,250కు పెంచారు.. జనవరి 2022న రూ.2,500కు జనవరి 2023న రూ. 2,750కు.. ఇప్పుడు రూ.3వేలకు పెంచేశారు సీఎం వైఎస్ జన్. అయితే, త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. పెన్షన్ పెంచనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. మరోసారి అధికారం ఇస్తే.. ఈ సారి పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని కాకినాడ వేదికగా జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!