YSR Cheyutha: నేడు వైఎస్సార్ చేయూత నిధుల విడుదల.. అనకాపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Cheyutha: ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్ నొక్కి మహిళల ఖాతాలో 18 వేల 750 చొప్పున జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున.. వారి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం విదితమే.. మొత్తం 31 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. అయితే, ఈ సారి అనకాపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా.. అనకాపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు..
Read Also: Enumamula Market: వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు సెలవు
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో.. అనకాపల్లిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ వాహనాలు మళ్లించినట్టు పోలీసులు ప్రకటించారు. విశాఖపట్నం నుండి తుని వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలని సూచించారు. ఇక, తుని నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – ఎలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవాలని స్పష్టం చేశారు పోలీసు అధికారులు.
Read Also: IND vs ENG Test: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు.. అశ్విన్, బెయిర్స్టోకు ప్రత్యేకం!
ఇక, అనకాపల్లి పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి.. 10.45 గంటలకు కశింకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.15 గంటలకు పిసినికాడ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీ సీఎం.. 11.40 గంటల నుంచి సుమారు గంటసేపు ప్రసంగించిన అనంతరం.. అదే వేదిక నుంచి బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహిళామార్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 1.05 నుంచి 2.05 గంటల వరకు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమాశం కానున్నారు.. 2.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని.. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?