YSR Cheyutha: నేడు వైఎస్సార్ చేయూత నిధుల విడుదల.. అనకాపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
YSR Cheyutha: ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్ నొక్కి మహిళల ఖాతాలో 18 వేల 750 చొప్పున జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున.. వారి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం విదితమే.. మొత్తం 31 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. అయితే, ఈ సారి అనకాపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా.. అనకాపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు..
Read Also: Enumamula Market: వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్కు 3 రోజులు సెలవు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో.. అనకాపల్లిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ వాహనాలు మళ్లించినట్టు పోలీసులు ప్రకటించారు. విశాఖపట్నం నుండి తుని వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలని సూచించారు. ఇక, తుని నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – ఎలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవాలని స్పష్టం చేశారు పోలీసు అధికారులు.
Read Also: IND vs ENG Test: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు.. అశ్విన్, బెయిర్స్టోకు ప్రత్యేకం!
ఇక, అనకాపల్లి పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి.. 10.45 గంటలకు కశింకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.15 గంటలకు పిసినికాడ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీ సీఎం.. 11.40 గంటల నుంచి సుమారు గంటసేపు ప్రసంగించిన అనంతరం.. అదే వేదిక నుంచి బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహిళామార్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 1.05 నుంచి 2.05 గంటల వరకు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమాశం కానున్నారు.. 2.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని.. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!