Jagananna Videshi Vidya Deevena: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ రోజే ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagananna Videshi Vidya Deevena: ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే కాగా.. తద్వారా అర్హులైన విద్యార్థులు విదేశాల నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి, వృత్తిపరమైన, గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇక, ఈ రోజు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు సీఎం వైఎస్ జగన్.. అర్హులైన 357 మంది విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించనున్నారు.. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జగనన్న విదేశీ విద్యకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు… ఇక, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబెర్స్మెంట్ చేయనుండగా.. ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.
Read Also: Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
అయితే, రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా వైఎస్ జగన్మోహన్ఱెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వైసీపీ సర్కార్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూరుస్తోంది.. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది , PG , PHD లేదా MBBS చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది ప్రభుత్వం.. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!