CM YS Jagan: ఈ మధ్య పవన్కు బీపీ ఎక్కువైంది.. జగన్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లలను పుట్టించి, కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గం కూడా వదిలిస్తున్నారు అంటూ హాట్ కామెంట్లు చేశారు. అందుకే దత్తపుత్రుడికి ఈమధ్య బీపీ ఎక్కువగా కనిపిస్తోందన్న ఆయన.. ఒక్కసారి చేస్తే పొరపాటు మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారని దత్త పుత్రుడికి చెప్పా.. పవిత్రమైన బంధాన్ని నడిరోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పు కాదా? అని దత్తపుత్రుని అడుగుతున్నాను అన్నారు. నువ్వు చేస్తున్నది తప్పు కదా? అని అడిగితే అది దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోయి ఊగిపోతున్నారు.. నేను అడిగే ప్రశ్నలకు చంద్రబాబుకి కోపం, దత్తపుత్రుడికి కోపం, చంద్రబాబు వదినకు కూడా కోపం అని ఎద్దేవా చేశారు.
Read Also: CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే..
Also Read
- SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
- KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
చేసిన మంచి మాత్రం చెప్పడానికి చేసిన మంచి చెప్పడానికి ఏ ఉదాహరణ కనిపించదు.. చంద్రబాబు చేసిన మోసాలు చూపడానికి చాలా కనిపిస్తాయన్నారు సీఎం జగన్.. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి ఆయన చేసిన మంచి కనిపించదు.. చంద్రబాబు తన జీవితమంతా మోసాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉంటారు.. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే .. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కాంగ్రెస్ కోవర్టులు వ్యవస్థలో ఉన్న వీరి మనుషులు కలసి ఒక్క జగన్ పై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఒక్కడు . బాబుకు 10 మంది సేనానులు.. చంద్రబాబు వెనుక పదిమంది సేనానులు బాణాలు ఎక్కువ పెట్టి ఉన్నారు.. వారు వేసే బాణాలు తగిలిబోయేది జగన్ కా .. లేక జగన్ అమలు చేసే పథకాలకా అనేది ప్రజల ఆలోచించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
-
Police Complaint Director: వారి వల్లే వరలక్ష్మికి సారీ చెప్పా.. సమస్య సద్దుమణగలేదు!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!