CM YS Jagan: మైనారిటీలకు తొలిసారి రిజర్వేషన్లు కల్పించిన నేత వైఎస్.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీ డేను ప్రకటించారు.. దేశంలోనే తొలి సారి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్.. దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించారు అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం మైనారిటీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేక పోయింది.. కానీ, రెండు సార్లు క్యాబినెట్ కూర్పు చేశాను.. రెండు సార్లు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను అని తెలిపారు సీఎం జగన్. నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం.. నలుగురు మైనారిటీలకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాం.. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఒక మైనారిటీ మహిళకు అవకాశం కల్పించామన్న ఆయన.. ఈ నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. అన్ని పదవుల్లో 50 శాతం అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు ఇచ్చే విధంగా ఏకంగా చట్టమే చేశాను అన్నారు. వేసే ప్రతి మొక్క రేపు చెట్టు కావాలి.. షాది తోఫా పథకంలో పదవ తరగతి నిబంధనను చాలా మంది తీసి వేయమని నన్ను అడిగారు.. ఎన్నికల సమయంలో ఈ నిబంధన వద్దు అన్నారు.. నాయకుడు ఎన్నికల గురించి కాదు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించించాలని సూచించారు.
Also Read
- Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
- Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
ఈ నాలుగున్నర ఏళ్లల్లో మంచి చేశాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నారు సీఎం జగన్.. ఉర్దూను రెండవ అధికార భాషగా చేశాం.. హజ్ యాత్రకు విజయవాడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం రావాలి అని చర్యలు తీసుకున్నాం.. దీని కోసం 14 కోట్ల రూపాయల భారం పడినా వెనుక అడుగు వేయలేదన్నారు. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మన ప్రభుత్వం బాగుండాలని దువా చేయమని మాత్రం అడిగాను అని గుర్తుచేసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా.. డా. సత్తార్ కు మౌలానా ఆజాద్ నేషనల్ అవార్డు -2023 ను ప్రదానం చేసిన సీఎం జగన్.. అబ్దుల్ హక్ అవార్డు -2023 ను డా. ఫక్రుద్దీన్ హక్ కు అందజేశారు.
తాజావార్తలు
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!