CM YS Jagan: మైనారిటీలకు తొలిసారి రిజర్వేషన్లు కల్పించిన నేత వైఎస్.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీ డేను ప్రకటించారు.. దేశంలోనే తొలి సారి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్.. దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించారు అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం మైనారిటీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేక పోయింది.. కానీ, రెండు సార్లు క్యాబినెట్ కూర్పు చేశాను.. రెండు సార్లు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను అని తెలిపారు సీఎం జగన్. నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం.. నలుగురు మైనారిటీలకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాం.. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఒక మైనారిటీ మహిళకు అవకాశం కల్పించామన్న ఆయన.. ఈ నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. అన్ని పదవుల్లో 50 శాతం అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు ఇచ్చే విధంగా ఏకంగా చట్టమే చేశాను అన్నారు. వేసే ప్రతి మొక్క రేపు చెట్టు కావాలి.. షాది తోఫా పథకంలో పదవ తరగతి నిబంధనను చాలా మంది తీసి వేయమని నన్ను అడిగారు.. ఎన్నికల సమయంలో ఈ నిబంధన వద్దు అన్నారు.. నాయకుడు ఎన్నికల గురించి కాదు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించించాలని సూచించారు.
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
- Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
- Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
ఈ నాలుగున్నర ఏళ్లల్లో మంచి చేశాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నారు సీఎం జగన్.. ఉర్దూను రెండవ అధికార భాషగా చేశాం.. హజ్ యాత్రకు విజయవాడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం రావాలి అని చర్యలు తీసుకున్నాం.. దీని కోసం 14 కోట్ల రూపాయల భారం పడినా వెనుక అడుగు వేయలేదన్నారు. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మన ప్రభుత్వం బాగుండాలని దువా చేయమని మాత్రం అడిగాను అని గుర్తుచేసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా.. డా. సత్తార్ కు మౌలానా ఆజాద్ నేషనల్ అవార్డు -2023 ను ప్రదానం చేసిన సీఎం జగన్.. అబ్దుల్ హక్ అవార్డు -2023 ను డా. ఫక్రుద్దీన్ హక్ కు అందజేశారు.
తాజావార్తలు
-
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
-
Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
-
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..