CM YS Jagan: నేను విన్నాను, నేను ఉన్నాను.. పెరాలసిస్ బాధితుడికి సీఎం జగన్ భరోసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Meets Paralysis Victim in Memantha Siddham Bus Yatra: చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి.. అప్పుల చేసి మరీ వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి.. ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. ముఖేష్ వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న ముఖేష్ కుటుంబంకు ఏం చేయాలో పాలుపోలేదు. సీఎం వైఎస్ జగన్ను కలిస్తే.. తప్పక తమకు సహాయం దొరుకుతుందని వారు నమ్మారు.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం సీఎం వైఎస్ జగన్ను కలిశారు. సీఎం వారిని బస్సు వద్దకు పిలిపించుకుని.. ముఖేష్ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. వెంటనే ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. దాంతో ముఖేష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం తమకు కలిగిందని ముఖేష్ కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..