Site icon NTV Telugu

Yogi Adityanath: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు భూ హక్కులు..

Yogi

Yogi

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల బాధ, పోరాటాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read:Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..

విభజన తర్వాత, ముఖ్యంగా 1960- 1975 మధ్య, వేలాది హిందూ కుటుంబాలు తూర్పు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి బలవంతంగా వలస వచ్చాయి. వారిలో పెద్ద సంఖ్యలో యుపిలోని పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, బిజ్నోర్, రాంపూర్ జిల్లాల్లో స్థిరపడ్డారు. ప్రారంభంలో, వారిని ట్రాన్సిట్ క్యాంపుల ద్వారా తాత్కాలిక ప్రదేశాలలో ఉంచారు. తరువాత వివిధ గ్రామాలలో వారికి భూమిని కేటాయించారు. కానీ సంవత్సరాల తర్వాత కూడా, ఈ కుటుంబాలలో ఎక్కువ మంది చట్టబద్ధమైన భూ యజమానులు కాలేకపోయారు.

Also Read:Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..

ఈ వ్యక్తులకు భూమి ఇచ్చారు. కానీ పత్రాలు అసంపూర్ణంగా ఉన్నాయి. చాలా సందర్భాలలో భూమి అటవీ శాఖ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. పేరు బదిలీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. కొంతమందికి భూమి ఉంది కానీ వారి వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు లేవు. అయితే కొన్ని గ్రామాల్లో భూమి ఎవరి పేరు మీద ఉందో ఆ కుటుంబాలు ఇప్పుడు లేవు. కొన్ని కుటుంబాలు చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండానే స్వాధీనం చేసుకున్నాయి. ఇది వివాద పరిస్థితిని సృష్టించింది.

Also Read:Vivo Y50m 5G, Y50 5G: కేవలం రూ.13,000ల ప్రారంభ ధరకే ఇన్ని ఫీచర్లున్న ఫోన్ ఏంటి భయ్యా.. గ్లోబల్ గా విడుదలైన కొత్త వివో మొబైల్స్..!

ఈ పరిస్థితులన్నింటి కారణంగా, వేలాది కుటుంబాలు ఇప్పటికీ ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నాయని, కానీ వారి పేర్లు రెవెన్యూ రికార్డులలో నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఈ సమస్య కేవలం చట్టపరమైన లేదా పరిపాలనా సమస్య కాదని, జాతీయ బాధ్యత, మానవ విధి అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు చెప్పారు. ప్రభుత్వ గ్రాంట్ చట్టం కింద గతంలో భూమి ఇచ్చిన చోట, ప్రస్తుత చట్టపరమైన చట్రం ప్రకారం ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఎందుకంటే ఈ చట్టం 2018లో రద్దు చేశారు. ఈ మొత్తం సమస్యను పునరావాస ప్రణాళికగా మాత్రమే చూడకూడదని, ఇది సామాజిక న్యాయం, మానవత్వం, జాతీయ విధికి సంబంధించిన విషయం అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Exit mobile version