Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Revanth Reddy Speech At Vizag

CM Revanth Reddy : చ‌ట్టస‌భ‌ల్లో అవ‌కాశం ఇవ్వండి.. ఏపీలో రేవంత్‌

Published Date :March 16, 2024 , 10:52 pm
By Gogikar Sai Krishna
CM Revanth Reddy : చ‌ట్టస‌భ‌ల్లో అవ‌కాశం ఇవ్వండి.. ఏపీలో రేవంత్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు ప్ర‌శ్నించే త‌త్వం లేనందునే ప‌దేళ్ల‌యినా పోల‌వ‌రం పూర్తికాలేద‌ని, రాజ‌ధాని ఎక్క‌డో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని, ప‌దేళ్లుగా ఇక్క‌డి పాల‌కులు ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీకి తాక‌ట్టు పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జ‌రిగిన *విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు న్యాయ‌సాధ‌న స‌భలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారిగా మ‌న‌మొక్క‌టేన‌ని, కురుక్షేత్రంలో కౌర‌వులు, పాండ‌వుల మ‌ధ్యే యుద్ధం జ‌రిగింద‌ని, కానీ వారిపైకి ఎవ‌రైనా వ‌స్తే వారు 105 మంది ఏక‌మై త‌మ హ‌క్కుల కోసం పోరాడార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాల‌తో సాధించిన విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అదానీ కోసం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విక్ర‌యిస్తుంటే ఇక్క‌డి ప‌హిల్వాన్లుగా చెప్పుకుంటున్న నాయ‌కులు ప్ర‌శ్నించ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. మ‌నం క‌లిసి పోరాడితే ఢిల్లీ సుల్తానులు, జాగీరార్దులు, పాల‌కులు ఎవ‌రైనా త‌ల‌వంచాల్సిందేన‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీలం సంజీవ రెడ్డి, పి.వి.న‌ర‌సింహారావు, ఎన్టీ రామారావు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి ఉద్ధండ నేత‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై కేంద్ర నేత‌ల‌ను నిల‌దీసి దేశ రాజ‌కీయాల‌ను శాసించార‌ని కొనియాడారు. ప్ర‌స్తుతం ప్ర‌శ్నించే నాయ‌కులే లేర‌ని, వంగి వంగి దండాలు పెట్టే నాయ‌కులు త‌యార‌య్యార‌న్నారు. బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్ అని, ఈ రాష్ట్రంలో మోదీకి బ‌లం వారేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు మేం ఆయ‌న‌కు ఓటేశాం, మేం ఈయ‌నకు ఓటు వేశాం అనుకోవ‌చ్చ‌ని, కానీ ఎవ‌రికి వేసినా అంతిమంగా ఆ ఓటు వెళ్లేది బీజేపీకేన‌ని గుర్తుంచుకోవాల‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ లేదు.. మీరు అక్క‌డ‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని కొంద‌రు స‌న్నిహితులు త‌న‌కు సూచించార‌ని, కానీ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వార‌సురాలు ష‌ర్మిల స‌భ పెడితే ఆయ‌న అభిమానులు అండ‌గా నిలుస్తార‌ని భావించి తాను వ‌చ్చాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ స‌భ‌ను చూస్తుంటే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో హైద‌రాబాద్‌లో స‌భ పెట్టిన‌ట్లుగా ఉంద‌ని, త‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టినందుకు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానుల‌కు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్నాన‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కాంగ్రెస్‌కు అయిదు ఎంపీలు, శాస‌న‌స‌భ‌కు 25 మంది ఎమ్మెల్యేల‌ను పంపాల‌ని, చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిథ్యం వ‌హించే అవ‌కాశం కాంగ్రెస్ పార్టీకి క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు విజ్ఙ‌ప్తి చేశారు. ఇక్క‌డ అచ్చోసిన అంబోతుల్లా ఆ ఇద్ద‌రు పోట్లాడుతుంటే కాంగ్రెస్‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంద‌ని అనుకోవ‌ద్ద‌ని, తెలంగాణ‌లోనూ ఒక ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 3,200 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లోనూ మోడీ, కేడీ మ‌ధ్య తాము నిలిచి కొట్లాడినందునే శాస‌న‌స‌భ‌లో అయిదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో 65 స్థానాలు గెలిచి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు తెలివైన వారు, విజ్ఙుల‌ని, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా స‌హా అనేక రంగాల్లో ముందున్న వారు ఎన్నిక‌ల్లో తెలివైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని, ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని గెలిపించాల‌ని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • CM Revanth Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

  • India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions