Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Reviews Indiramma Housing Bhoobharthi Land Reforms

CM Revanth Reddy : నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Published Date :December 23, 2024 , 8:23 am
By Gogikar Sai Krishna
  • నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్న సీఎం.
CM Revanth Reddy : నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్‌ ఉంది. ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూభారతిపై కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

PM Modi: నేడు రోజ్‌గార్‌ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ

Also Read

  • Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ
  • RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్‌
  • Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్‌ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
  • Mamata Banerjee: 'మాజీ' అని పెట్టుకోను.. మమతా బెనర్జీ 'X' బయోలో తెలివైన మార్పు!
Add as a preferred
source on google

అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన భూభారతి (రికార్డ్ ఆఫ్ రెవెన్యూ – 2024) బిల్లు, కాస్తు కాలమ్/అనుభవదారు కాలమ్‌ను పునరుద్ధరించడం ద్వారా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు తిరిగి రికార్డుల్లోకి రావడం వల్ల కొన్ని వర్గాలు సంతోషించగా, మరికొన్ని వర్గాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయంతో ఉంది. ‘‘ఏనాడో ఈ మార్పు జరిగిపోయింది. ఇప్పుడు పేర్లు తిరిగి రాయడం గొడవలకు దారితీస్తుంది,’’ అని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో కాస్తు కాలమ్, అనుభవదారు వ్యవస్థకు ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో రైతాంగ పోరాటాలు, నక్సల్బరీ ఉద్యమాల ద్వారా లక్షలాది ఎకరాలు పేదలకి లభించాయి. ప్రస్తుతం 1.30 కోట్ల ఎకరాల్లో 30 లక్షల ఎకరాలను రైతులు దశాబ్దాలుగా దున్నుతున్నారు. అయితే, ఈ భూముల్లో కొందరికి మాత్రమే హక్కులు లభించాయి. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత, అనేక మంది పేర్లు రికార్డుల నుంచి తొలగించబడ్డాయి.

ధరణి అమలులోకి రావడం ద్వారా భూములపై పేదల నియంత్రణ తగ్గిందన్న అభిప్రాయం ఉంది. రికార్డుల్లో పేర్లను తొలగించడం వల్ల పేదలకు నష్టమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అనుభవదారుల పేర్లను కాస్తు కాలమ్ నుంచి తొలగించి, పట్టాదారుల పేర్లను మాత్రమే నమోదు చేశారు. ఈ ప్రక్రియలో ఎటువంటి సంప్రదింపులు లేకపోవడం, చట్టపరమైన ఉత్తర్వులు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రశ్నార్థకమైంది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి డేటాలో మార్పులు జరిగాయి. తమ భూమి మాకాదని వదిలేసి వెళ్లిన భూస్వాములు తిరిగి వచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. పేదలను బెదిరించి భూములను రియల్టర్లకు అమ్ముకున్న ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ వంటి ఉమ్మడి జిల్లాల్లో లక్షల ఎకరాలు సంపన్నుల చేతుల్లోకి వెళ్లాయి.

వారసత్వ హక్కులు, భాగస్వామ్యాలు, సాదాబైనామాల కింద భూముల కొనుగోళ్లు వంటి వివిధ సందర్భాల్లో కాస్తు కాలమ్‌లో పేర్లు నమోదయ్యాయి. కానీ, ప్రస్తుతం దాదాపు 9 లక్షల అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. కాస్తు కాలమ్ పునరుద్ధరణకు పాలనాపరమైన సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ఎవరికి సమస్యలు తలెత్తుతాయి? హక్కుదారులకు ఇబ్బందులు ఏమైనా ఉంటాయా?’’ అన్న ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నెహ్రూ చెప్పినట్లు, ‘‘పొజిషన్‌ను కాపాడటం ప్రభుత్వ బాధ్యత,’’ అని ప్రభుత్వం భావించాలి. ఇక, భూస్వాములు, పేద రైతులు, రెవెన్యూ శాఖ మధ్య సమన్వయం సాధించడం ఈ సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు.

IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhoobharthi Bill 2024
  • CM Revanth Reddy
  • Dharani Portal
  • Indiramma housing scheme
  • Land Rights

తాజావార్తలు

  • NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!

  • Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ

  • OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!

  • Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?

  • Vladimir Putin: పుతిన్‌కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions