Road Accident: జబల్పుర్ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం!
- జబల్పుర్ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
- అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
- ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని జబల్పుర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నగరంలోని నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు త్వరిగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు.
జబల్పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో ఆయన మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని.. గాయపడిన వారికి సరైన చికిత్సనందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి.. ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులనూ ఫోన్లో కేంద్రమంత్రి పరామర్శించారు. ప్రమాద ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తున్న తెలుగు యాత్రికులు మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును జబల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహ్లా, బర్గి గ్రామాల మధ్య ఉన్న కాలువ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. జబల్పూర్ నుండి కాట్నీ వైపు వెళ్తున్న ట్రక్.. రాంగ్ రూట్లో వెళ్లి మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 14 మంది ఉన్నారు. ప్రమాదానికి గురైన వాహనం నంబర్ AP29 W 1525గా స్థానిక పోలీసులు గుర్తించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించారు.
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!