CM Revanth Reddy: ఉగ్రవాదులను ఏరివేయండి.. మా మద్దతు ఉంటుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: భారత సైన్యం నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్”కు సంఘీభావంగా హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ సంఘీభావ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. సెక్రటేరియట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సీఎం తన భుజాన జాతీయ జెండా వేసుకొని పాల్గొనడం విశేషం. ర్యాలీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. టెర్రరిస్టుల దాడిలో అమరులైన సైనికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
Read Also: Operation Sindoor: టెర్రరిస్ట్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం.. యూఎస్ జర్నలిస్ట్ హత్యకు భారత్ ప్రతీకారం..
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
ర్యాలీ సందర్బంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల నుదిటి సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. భారతదేశ ప్రజలంతా ఒక్కటే. దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తే, దాడి చేసిన వారికి భూమి మీద నూకలు ఉండవని స్పష్టం చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు వేరే విషయం. కానీ, ఉగ్రవాదంపై పోరాటంలో దేశం ఏకం. రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోండి, మా మద్దతు మీకు ఉంటుంది అని అన్నారని తెలిపారు. మా శాంతి స్వరూపాన్ని చేతగానితనంగా భావించకూడదు. అటువంటి శక్తులకు సమాధానం ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. ఈ సంఘీభావ ర్యాలీ దేశభక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సైన్యానికి పూర్తి మద్దతుగా ఉందని ఈ ర్యాలీ ద్వారా తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!