CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్కాన్పేట్లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజాప్రతినిధులను తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. పాసులు ఇచ్చి వారిని కార్యక్రమాలకు పిలవాలని, వారిని భాగస్వామ్యం చేస్తేనే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
ఫ్యూచర్ సిటీ పరిధిలోని సర్పంచ్లకు తప్పనిసరిగా ఆహ్వానం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక, ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రావాలనుకునే గ్రామాలు గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి కలెక్టర్కు పంపించాలని, సంబంధిత ఇన్ఛార్జి మంత్రులకు కూడా వివరాలు తెలియజేయాలని సూచించారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
భూమి సేకరణ విషయంలో రైతులతో చర్చించి, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. మాట్లాడకుండా భూమి తీసుకుంటే అపోహలు ఏర్పడతాయని, అందుకే పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భూమి ధరలు భారీగా పెరిగాయని, గతంలో ఎకరం రూ.3 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.6 కోట్లకు పెరిగిందని వివరించారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్రపంచ స్థాయి నగరాలైన సింగపూర్, టోక్యో, న్యూయార్క్ సిటీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. జూన్ 2 నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయని, కానీ ఆ ప్రాజెక్ట్ విజయవంతమైందని గుర్తుచేశారు. అదే విధంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!