CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్కాన్పేట్లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజాప్రతినిధులను తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. పాసులు ఇచ్చి వారిని కార్యక్రమాలకు పిలవాలని, వారిని భాగస్వామ్యం చేస్తేనే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
ఫ్యూచర్ సిటీ పరిధిలోని సర్పంచ్లకు తప్పనిసరిగా ఆహ్వానం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక, ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రావాలనుకునే గ్రామాలు గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి కలెక్టర్కు పంపించాలని, సంబంధిత ఇన్ఛార్జి మంత్రులకు కూడా వివరాలు తెలియజేయాలని సూచించారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
భూమి సేకరణ విషయంలో రైతులతో చర్చించి, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. మాట్లాడకుండా భూమి తీసుకుంటే అపోహలు ఏర్పడతాయని, అందుకే పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భూమి ధరలు భారీగా పెరిగాయని, గతంలో ఎకరం రూ.3 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.6 కోట్లకు పెరిగిందని వివరించారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్రపంచ స్థాయి నగరాలైన సింగపూర్, టోక్యో, న్యూయార్క్ సిటీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. జూన్ 2 నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయని, కానీ ఆ ప్రాజెక్ట్ విజయవంతమైందని గుర్తుచేశారు. అదే విధంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?