NTV Telugu Site icon

CM Revanth: కేసీఆర్, కేటీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Cm Revanth

Cm Revanth

కేసీఆర్, కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు. లేకపోతే గుంటూరులో చాయ్, టిఫిన్స్ అమ్ముకుంటూ ఉండేవాడివి.. సిద్దిపేటలో ఛాయ్ అమ్ముకుంటూ ఉండేటోడివి అంటూ ఎద్దేవా చేశారు. ఎంత బలుపు మాటలు.. అధికారం పోయిన మదం తగ్గలేదని కేటీఆర్ పై ధ్వజమెత్తారు.

Demonte Colony 2: భయపెట్టడానికి మీ ఇంటికే ‘డీమాంటే కాలనీ 2’.. జాగ్రత్త!

త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబాలవేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని దుయ్యబట్టారు. మీ ఫామ్ హౌజ్‌లలో జిల్లెళ్లు మొలిపిస్తానని చురకలు అంటించారు. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలకు చెబుతున్నా.. వెయ్యి ఎకరాల్లో తండ్రి ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడు.. కొడుకు వంద ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడని అన్నారు. సొంత విగ్రహం పెట్టుకునేందుకు సెక్రటేరియట్ ముందు స్థలాన్ని పెట్టుకున్నాడు అని తెలిపారు. ‘ఎవడొస్తాడో రండిరా.. టైమ్ చెప్పండి.. ఎవడు వస్తాడో చూస్తా.. తెలంగాణ ఇచ్చింది మేము.. తెలంగాణ తెచ్చింది మేము… సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేము..’ అని అన్నారు.

BJP: 10 రోజుల అమెరికా పర్యటనలో 5 గంటలే మాత్రమే సమావేశాలు.. రాహుల్ గాంధీ మిగతా సమయం ఎక్కడ..?

బీఆర్ఎస్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ కుటుంబం ఒక్కరు కూడా హాజరు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు రెగ్యులర్‌గా షాక్ ట్రీట్మెంట్ జరుగుతుంది.. అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని విమర్శించారు. కాలకేయ ముఠా గ్రామాల మీద పడుతుంది.. కొంతమంది మిడతల దండును మన ప్రజల మీదకు ఉసి గొల్పుతున్నరు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ మిడతల దండును తరిమికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.