CM Revanth: కేసీఆర్, కేటీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
- కేసీఆర్.. కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
- ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోంది- సీఎం
- రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు- సీఎం
- ఐటీ మంత్రి అయ్యావ్.. లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు- రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్, కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు. లేకపోతే గుంటూరులో చాయ్, టిఫిన్స్ అమ్ముకుంటూ ఉండేవాడివి.. సిద్దిపేటలో ఛాయ్ అమ్ముకుంటూ ఉండేటోడివి అంటూ ఎద్దేవా చేశారు. ఎంత బలుపు మాటలు.. అధికారం పోయిన మదం తగ్గలేదని కేటీఆర్ పై ధ్వజమెత్తారు.
Demonte Colony 2: భయపెట్టడానికి మీ ఇంటికే ‘డీమాంటే కాలనీ 2’.. జాగ్రత్త!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబాలవేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని దుయ్యబట్టారు. మీ ఫామ్ హౌజ్లలో జిల్లెళ్లు మొలిపిస్తానని చురకలు అంటించారు. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలకు చెబుతున్నా.. వెయ్యి ఎకరాల్లో తండ్రి ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడు.. కొడుకు వంద ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడని అన్నారు. సొంత విగ్రహం పెట్టుకునేందుకు సెక్రటేరియట్ ముందు స్థలాన్ని పెట్టుకున్నాడు అని తెలిపారు. ‘ఎవడొస్తాడో రండిరా.. టైమ్ చెప్పండి.. ఎవడు వస్తాడో చూస్తా.. తెలంగాణ ఇచ్చింది మేము.. తెలంగాణ తెచ్చింది మేము… సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేము..’ అని అన్నారు.
BJP: 10 రోజుల అమెరికా పర్యటనలో 5 గంటలే మాత్రమే సమావేశాలు.. రాహుల్ గాంధీ మిగతా సమయం ఎక్కడ..?
బీఆర్ఎస్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ కుటుంబం ఒక్కరు కూడా హాజరు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు రెగ్యులర్గా షాక్ ట్రీట్మెంట్ జరుగుతుంది.. అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని విమర్శించారు. కాలకేయ ముఠా గ్రామాల మీద పడుతుంది.. కొంతమంది మిడతల దండును మన ప్రజల మీదకు ఉసి గొల్పుతున్నరు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ మిడతల దండును తరిమికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!