KTR : తెలంగాణ అభివృద్ధికి రేవంత్ ఏం చేశాడు?
- సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ విమర్శలు
- మంత్రివర్గ విస్తరణ చేయలేని అసమర్థత అని కేటీఆర్ ఎద్దేవా
- ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 36 సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
“తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. కానీ, తాను మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాడు,” అని విమర్శించారు. “నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ యాదొస్తోంది” అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లడం తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై న్యాయ కమిషన్ డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. అంతకుముందు సుంకిశాలా, పెద్దవాగు ప్రమాదాల సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.
ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్లను డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
“ప్రభుత్వం సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలి. కేంద్ర సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయాన్ని తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Mahashivratri 2025: శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది?
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!