CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..
- ఉమెన్స్ డే సందర్భంగా శుభవార్త చెప్పిన సీఎం రేవంత్..
- చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేస్తామని హామీ..
- డీజిల్ బస్సులను ఈ ఏడాది చివరికల్లా జిల్లాలకు తరలిస్తామన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యార్థినులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. చదువుకునే అమ్మాయిల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. త్వరలోనే వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు..
మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థినుల సౌకర్యార్థం త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. ఈ స్కూటీల పంపిణీ విద్యార్థినులకు విద్యాపరంగా ఎంతో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
- Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా 'బ్రదర్'.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
Also Read:Realme C83 5G: 7000mAh టైటాన్ బ్యాటరీతో రియల్మీ C83 5G.. బడ్జెట్లో బెస్ట్ లాంగ్ లైఫ్ ఫోన్!
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్లో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం తెలిపారు. నగరంలో తిరిగే డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి.. నగరం మొత్తం ఏసీ ఈవీ బస్సులతో నింపేస్తామని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ‘జీరో ట్యాక్స్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేవలం రవాణా రంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా మహిళలను బలోపేతం చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన ద్వారా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని.. కాలుష్య నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
-
Rohit Sharma-Team India: అగార్కర్తో విభేదాలు.. గంభీర్పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ట్రెండింగ్
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!