CM Revanth Reddy: గాంధీ-అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రక్తం చిందకుండా దేశం గెలవచ్చు అని గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారని.. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి అభివృద్ధి పథంలో నడపచ్చు అని ప్రపంచ మేధావి అంబేద్కర్ చాటి చెప్పారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గాంధీ, అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళు అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్పూర్తి తోనే సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి పదేళ్లలో పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏంటి అనేది ఆలోచన చేయాలని సూచించారు. దళిత గిరిజనులకు ఇచ్చిన ప్రాధాన్యత చూడాలన్నారు. కేబినెట్లో దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో పోల్చాలన్నారు. ఇంత ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలో అయిన వచ్చిందా? అని అడిగారు.
READ MORE: Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్లో కొత్త తలనొప్పి.. కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య
Also Read
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
“భట్టి విక్రమార్క సమర్థవంతంగా పని చేస్తున్నారు. ఆయన బడ్జెట్ ప్రవేశ పెడితే అవమానంగా మాట్లాడుతున్నారు. దళిత బిడ్డ ఆర్థిక మంత్రి గానో.. స్పీకర్ గానో ఉండొద్దా? దళిత బిడ్డను అధ్యక్షా అని మైక్ అడగాల్సి వస్తుంది అని కొందరు సభకు కూడా రావడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇప్పటి వరకు మీ జాతికి అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ అవకాశం కూడా వచ్చింది. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇలా అన్ని చోట్లా ప్రాధాన్యత ఇస్తున్నాం. డైట్ ఛార్జీలు 200 శాతం పెంచింది మేము. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి అన్ని వర్గాలకు ఒకే దగ్గర చదువుకునే ఏర్పాటు చేస్తున్నాం. అంబేద్కర్ ఆలోచతోనే మేము పేదలకు విద్య అందించే పనిలో ఉన్నాం. పేదలకు నాణ్యమైన విద్య అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను మెరుగైన విద్యా అందించాలని మా ఆలోచన. పదేళ్ల పాలన.. రెండేళ్ల మా పాలనను బేరీజీ వేసుకోండి. ఓర్వలేక.. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ దళిత.. గిరిజన బీసీలకు అందటం లేదా..? మేము 67 వేల ఉద్యోగాలు ఇస్తే.. 87 శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వచ్చాయి. మేం పనిలో పడిపోతుంటే కొందరు గోతులు తవ్వుతున్నారు. వాళ్ళ సంగతి మీరు చూసుకోండి.
వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళనే పాతి పెట్టండి. నల్లి కుట్లు.. వాళ్ళ సంగతి మీరు చూడండి. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులను తీర్చుతున్నాం.. గొప్ప మాటలు చెప్తున్న వాళ్ళు అంబేద్కర్ విగ్రహానికి ఎన్ని సార్లు నివాళి అర్పించారు అనేది లెక్క తీయండి.” అని సీఎం ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!