CM KCR : రైతు బంధు వస్తుందని కలలో కూడా అనుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళ పాలన ఎలా ఉందో మీకు తెలుసునన్నారు. తెలంగాణలో రైతుల గురించి అద్భుతంగా పని చేశామని, రైతు బంధు వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు సీఎం కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేయలేదని, రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమే కొంటుందన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు కట్టే పన్నుల డబ్బులని కేసీఆర్ వృథా చేసి రైతు బంధు ఇస్తున్నారని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, రైతు బంధు వృథానా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
- Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
- Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
అంతేకాకుండా.. ‘రైతు బంధు ఉండాలి..అది 16 వేలు కావాలి అంటే బీఆర్ఎస్ గెలవాలి. 24 గంటల కరెంట్ వెస్ట్ అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎవ్వరిని అడిగినా 24 గంటల కరెంట్ కావాలని అంటున్నారు. రేవంత్ మాత్రం 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఇంకా 10HP మోటార్ పెట్టుకోవాలి అంటున్నారు. రాహుల్ గాంధీ ధరణిని తీసివేస్తాం అంటున్నారు. ధరణి ఉంది కాబట్టే రైతు బంధు వస్తుంది. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఎలా వస్తుంది. ధరణి పోతే మళ్ళీ పాత కాలం మళ్ళీ వస్తుంది. ధరణి తీసేస్తే భూముల కబ్జాలు, పైరవీలు మళ్ళీ పెరుగుతాయి. మూడు సంవత్సరాలు కష్టపడి ధరణి తెచ్చాము. భూముల ధరలు పెరిగాయి..ధరణి లేకుంటే ఎన్నో గొడవలు జరిగేవి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఒరేయ్ సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లు. కులాలు, మతాలు అనే ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. సునీతా లక్ష్మా రెడ్డిని అభ్యర్థిగా పెడుదాం అన్నప్పుడు మదన్ రెడ్డి సహకరించారు. మదన్ రెడ్డి నా చిరకాల మిత్రుడు ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాం. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. అన్ని మతాలను, సంప్రదాయాలను బీఆర్ఎస్ గౌరవిస్తుంది.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : CM KCR : మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం
తాజావార్తలు
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!