Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Speech At Trslp

CM KCR : పోడు రైతులకు శుభవార్త.. పోడు భూముల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం

Published Date :November 15, 2022 , 9:52 pm
By Gogikar Sai Krishna
CM KCR : పోడు రైతులకు శుభవార్త.. పోడు భూముల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పాడుదామన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడిక్కడ బీజేపీ వికృత చేష్టలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉన్మాదంతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన మండిపడ్డారు. 8 ఏండ్ల కాలంలో ఈడీ అనేక కేసులు పెట్టింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసును నిరూపించలేకపోయింది. బీజేపీ దగ్గర రూ. 2లక్షల కోట్లు ఉన్నాయని సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..? దీన్ని దేనికోసం వాడుతున్నారో తెలియజెప్పాల్సిన బాధ్యత మనమీద ఉన్నది. బీజేపీ కావాలని బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులకు సైతం పూనుకోవచ్చు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు.
Also Read : SSC Exam Fee : విద్యార్థులకు శుభవార్త.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా? గూండాగిరి చేసింది. దాదాగిరి చేసింది. దేశంలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయం. దేశమంతా రాల్గాంధీ జోడోయాత్ర చేస్తాడు కానీ, గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని తెలిసి..అక్కడ జోడో యాత్ర చేయకపోవడం వెనుక ఆంతర్యం తానే కాదు ఎవరేం చేసినా కాంగ్రెస్ బతకదని చెప్పే ప్రయత్నం. దళితబంధు కోసం నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి. పోడు భూముల సమస్యకు త్వరలో పరిష్కారం. రాష్ట్రంలో 11. 5 లక్షల ఎకరాల భూమికి శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. అవి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో భోజనాలు చేసి పోయాం అన్నట్టుగా ఉండకూడదు. వీటికి మంత్రులు కూడా హాజరు కావాలి. జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రెటరీ జనరల్ కేకే ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
Also Read : DK Aruna : బీజేపీ ఎప్పుడో టీఆర్‌ఎస్‌పై యుద్ధం ప్రకటించింది

త్వరలో జిల్లా పర్యనలు చేస్తా. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయి. సిట్టింగ్లకే సీట్లు. 95 సీట్లను అవలీలగా గెలుస్తాం. ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ కార్డులను రూపొందించాలి. మన ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ అందులో ఉండాలి. ఎమ్మెల్యేలందరూ ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జీని నియమించాలి. ఆ జాబితాను పంపించాలి. ఫోన్లు చేసి పార్టీ మారుతారా? అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతా అని గట్టిగా చెప్పాలి. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలుంటే 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలో దర్జాగా ఉన్నామనే ధైర్యంగా ఉండాలి. నియోజకవర్గాల్లో సొంత జాగ ఉండి. ఇల్లులేని వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఇస్తాం. ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఉండండి.’ అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • cm kcr
  • latest news

తాజావార్తలు

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions