CM KCR : తెలంగాణలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామానికి చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మలూరులో కార్యక్రమంలో భాగంగా మహా గని మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ కొద్దిగా పచ్చబడిందని, 8 ఏండ్ల నుంచి పట్టుబట్టి జట్టుకట్టి బీడు వారిన తెలంగాణను ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. వడ్లు పండించడంలో 2014లో మనం 15, 16వ స్థానంలో ఉన్నామని, ఇవాళ దేశంలో అతి ఎక్కువ వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ అని పత్రికల్లో వచ్చిందని ఆయన వెల్లడించారు. మనకు భూమి, నీళ్లు, అడవులు ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. విస్తృతంగా చెట్లు పెంచితే అపారమైన ఆక్సిజన్ లభిస్తుందని పేర్కొన్నారు. అద్భుతమైన అవకాశం ఉన్న దేశంలో అడవులను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. హరితహారం అనే చెబితే చాలా మందికి అర్థం కాలేదని, హాస్యాస్పదం చేశారని గుర్తు చేశారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభలో జోకులు వేశారని ఆయన అన్నారు.
Also Read : Bhatti Vikramarka : దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం
Also Read
‘100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా నదిలో నీళ్ల కోసం పంచాయతీ ఉందని కేసీఆర్ అన్నారు. గోదావరిలో నీళ్ల పంచాయతీ లేదు. గండిపేట, హిమాయత్ సాగర్ వరకు గోదావరి లింక్ అయిపోతుంది. అక్కడ్నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పద్ధతిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తాను. చింత చేయాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో భయంకరమైన పరిస్థితి ఉండే అని కేసీఆర్ గుర్తు చేశారు. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. తద్వారా చెట్లను పెంచాలని నిర్ణయించాం. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అని నేనే పాట రాశాను. పచ్చదనం ఉంటేనే వర్షాలు వస్తాయి. చెట్లు నాటడం ఏందని చాలా మంది నవ్వారు. కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనం పెరిగింది. నాశమైన అడవులను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అడవులను పెంపొందించేందుకు హరిత సైనికుల్లాగా ప్రియాంక వర్గీస్, భూపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. రిజర్వ్ ఫారెస్టును బ్రహ్మాండంగా పెంచుకున్నాం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read : Karnataka: కర్ణాటకలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 26మంది ఆఫ్రికన్ మహిళలు అరెస్ట్
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!