ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ జగన్ సర్కార్ చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. అయితే, పదవి విరమణ సమయంలో మూల వేతనంలో 50 శాతం పెన్షన్ భద్రత కల్పించేలా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది.
Read Also: keeda Kola: డిపిరి డిపిరి సాంగ్ భలే ఉందే..
కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రేపు(శనివారం) డీఏ విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ రిలీజ్ చేయనున్నారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు.