Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Jagan Launch New Schemes Kalyanmasthu Shadi Thopa

CM JaganMohanReddy: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం

NTV Telugu Twitter
Published Date :September 30, 2022 , 4:46 pm
By NTV WebDesk
CM JaganMohanReddy: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరో రెండు వినూత్న పథకాలను ప్రారంభించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాలు ప్రారంభం అయినట్టు ప్రకటించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాలను నిరోధించేందుకు విప్లవాత్మక అడుగు. ఇప్పుడు కళ్యాణమస్తు, షాదీతోఫాలు తీసుకు వచ్చాం. వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫాలు… పెళ్లి చేసుకుంటున్న ఇద్దరు పిల్లలు కూడా కచ్చితంగా పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకు వస్తున్నాం అన్నారు.

దీనివల్ల కచ్చితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పదో తరగతి వరకూ చదివిస్తారు. పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. దీని వల్ల పిల్లలంతా చదువుకునే పరిస్థితి వస్తుంది. టెన్త్‌ పాసైతే… ఆ తర్వాత 18 ఏళ్ల వరకూ పెళ్లి చేసుకోలేరు కాబట్టి, ఇంటర్మీడియట్‌ కూడా చదువుకునే అవకాశం వస్తుంది. ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో పథకం పెట్టేవారన్నారు జగన్.

తర్వాత పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68కోట్లు వివాహ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈపథకం అమల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గత ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా.. ఇప్పుడు రెట్టింపు ఈ పథకం ద్వారా అందబోతోంది. గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలకు రూ50వేలు ఇస్తామని ప్రటిస్తే.. ఇప్పుడు మనం రూ.1 లక్ష ఇవ్వనున్నాం. ఎస్సీ, ఎస్టీల్లో కులాంత వివాహాలకు రూ.75వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు మనం రూ.1.2 లక్షలు ఇవ్వనున్నాం. బీసీలకు రూ.30వేలు ఇస్తామని ప్రకటిస్తే. ఇప్పుడు మనం రూ.50వేలు ఇవ్వనున్నాం.

Read Also: Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..

బీసీల కులాంతర వివాహాలకు రూ.50వేలు ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.75వేలు ఇవ్వనున్నాం. మైనార్టీలకు గత ప్రభుత్వం రూ. 50వేలు ప్రకటిస్తే.. మనం రూ.1లక్ష ఇవ్వనున్నాం. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం రూ.1 లక్ష ఇస్తే, ఇప్పుడు రూ.1,50,000లు ఇవ్వనున్నాం. భవన, ఇతర నిర్మాణకార్మికులకు రూ.20వేలు గత ప్రభుత్వం ప్రకటిస్తే.. ఇప్పుడు రూ.40వేలు ఇవ్వనున్నాం. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. పెళ్లైన 60 రోజుల్లో వారి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం.అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో దరఖాస్తు లబ్ధిదారులకు జనవరిలో ఇవ్వబడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఉన్నవారికి ఏప్రిల్‌లో, ఏప్రిల్, మే, జూన్‌లో ఉన్నవారికి జులైలో ఇవ్వడం జరుగుతుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో లబ్ధిదారులకు అక్టోబరులో పథకాలను అందిస్తాం. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను కూడా సచివాలయాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్.

Read Also:యంగ్ ఏజ్ లోనే తండ్రులను పోగోట్టుకున్న స్టార్ హీరోలు వీరే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm jagan
  • kalyana mastu
  • new schemes
  • Shadi Thopa
  • ysr kalyanamastu

తాజావార్తలు

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Plane Crash: ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం..

  • Honeymoon Murder Case: నాలుగో ప్రయత్నంలో భర్తని చంపిన భార్య సోనమ్..

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Wife Affair: పెళ్లైన 13 ఏళ్లకు బయటపడ్డ భార్య ప్రేమ వ్యవహారం.. పెళ్లి చేసిన భర్త

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions