CM Jagan Comments: చంద్రబాబు హయాంలో స్కీంలు లేవు.. అన్నీ స్కామ్ లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గతంలో ఎప్పుడూ కూడా ఆయన చేయ్యలేదు.. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కరువు ఉంది అని సీఎం ఆరోపించారు. నేను అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షం పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు వెనక గజదొంగల ముఠాతో పాటు దత్తపుత్రుడు ఉన్నాడు అని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హాయంలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించే ఆలోచనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ స్కామ్, ఇసుక స్కామ్, అమరావతి భూముల స్కామ్ లు మాత్రమే జరిగాయని సీఎం జగన్ ఆరోపించారు.
Read Also: Priyanka Gandhi: బొకే స్కాంలో ప్రియాంక గాంధీని ఇరికించిన నేతలు.. స్టేజీ పై నవ్వులు పూయించారు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
రైతులను చంద్రబాబు మోసం చేశారు అని సీఎం జగన్ అన్నారు. బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం వేలం వేసేలా చేశాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ పథకాన్ని గత పాలకులు నీరుగార్చారు.. కానీ, నేడు ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి.. దుర్భిక్ష ప్రాంతాల్లో గతంలో ఎన్నడైనా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారా.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద రూ. 45 వేల కోట్లు ఇచ్చాం.. చంద్రబాబుకు అధికారం కావాల్సింది.. ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు.. చంద్రబాబుకు అధికారం కేవలం తాను, తన గజదొంగల ముఠా కోసం అధికారం కావాలని సీఎం జగన్ విమర్శించారు.
Read Also: pregnant woman: నిండు గర్భిణిని అంబులెన్స్ లేక 5కి.మీ దూరం మోసుకెళ్లిన బంధువులు.. కానీ అప్పటికే
ఇక, పుట్టపర్తిలో వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 53 లక్షల 53 మంది రైతులకు పెట్టబడి సాయం.. రైతులకు రూ. 2,200 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెలలోనే వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాయతక్వంలోకి తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!