CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన పలు గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. నల్లమల ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్న నన్నారీ గిరిజన ఉత్పత్తులతో పాటు పాడేరు, రంపచోడవరం, అరకు, చింతపల్లి, పార్వతీపురం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు స్వహస్తాలతో తయారు చేసిన విశిష్ట వస్తువులను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో రూపుదిద్దుకునే ఈ ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించి, విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పీ4 (P4) విధానంతో పాటు ‘సూపర్ సిక్స్’ పథకాలు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల నాణ్యతను నిరంతరం అంచనా వేసేందుకు నేరుగా ప్రజల నుంచే అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
‘అనే నేను’ అనే బలమైన ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకున్నప్పుడే వ్యక్తులుగా, కుటుంబాలుగా, సమాజంగా , దేశంగా ప్రగతి సాధించగలమన్నారు. సీఎం హోదాలో తాను ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి, వారి జీవన ప్రమాణాలను పెంచినప్పుడే తన లక్ష్యం నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. ‘నా దేశం, నా ప్రాంత అభివృద్ధిలో నేను ఎలా భాగస్వామిని కాగలను?’ అని ప్రతి పౌరుడూ ఆలోచించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థుల్లో బాధ్యత పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని కాపాడేలా ‘గ్రీన్ పాస్పోర్ట్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని తెలిపారు. రాబోయే 80వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 21 ఏళ్లలో మన దేశం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యున్నత అభివృద్ధికి చిరునామాగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!