CM Chandrababu: మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయండి!
- రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్గా జీఎస్టీ
- జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు
- జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం
- మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘రాష్ట్ర ప్రజాలకు దసరా శుభాకాంక్షలు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్. రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్గా జీఎస్టీ ఉంటుంది. 30 రోజుల పాటు జీఎస్టీ కార్యక్రమం జరుగుతుంది. నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమర్ యాదవ్, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్లతో కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకం అని ప్రధాని చెప్పారు. ఏపీలో కూడా ప్రగతిశీల ప్రజా విధానంతో పేదల జీవితాలు మార్చడమే మా లక్ష్యం. ఈ లక్ష్యానికి సూపర్ జీఎస్టీ, పీ4 ఉపయోగపడతాయి. ప్రతి ఇల్లు రీచ్ అయ్యేలా జీఎస్టీ కార్యక్రమాలు ఉండాలి. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతీ ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తాం. 65 వేలకు పైగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎలా పెరిగాయి, అగ్రికల్చర్ వల్ల ఎలాంటి లాభం వచ్చింది, మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ఉపయోగం, అభివృద్ధి. సంపద సృష్టికి సంబంధించి అవగహన ఉంటుంది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
Also Read: Nara Lokesh: పవన్ అన్నను ఆహ్వానించా.. ఇక ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తాం!
‘పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం. 2047 నాటికల్లా ఈ లక్ష్యాల సాధనకు జీఎస్టీ, సూపర్ సిక్స్, పీ4 కార్యక్రమాలు శక్తివంతంగా పనిచేస్తాయి. నిత్యావసర వస్తువుల్లో చాలా వాటికి సున్నా శాతం పన్ను ఉంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు లబ్ది కలుగుతుంది. ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుంది. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా నెక్స్ జెన్ జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు పెద్ద ఎత్తున సహకారం లభిస్తుంది. గ్లోబల్ బ్రాండ్లుగా భారతీయ ఉత్పత్తులు పోటీ పడేందుకు పెద్ద ఎత్తున ఆస్కారం కలుగుతుంది. భారతీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములైనట్టే. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలందరికీ పిలుపును ఇస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..