NTV Telugu Site icon

CM Chandrababu : విజయనగరంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Delhi

Chandrababu Delhi

విజయనగరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటంచనున్నారు. ఇందుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మ‌ధ్యాహ్నం 12 గంటల సమాయానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఇప్పకే 25 శాతం పనులు పూర్తాకగా, మిగిలన పనుల‌ను సీఎం పరిశీలించనున్నారు. టెర్మినల్, రన్ వే, అప్రోచ్ రోడ్లుల పనుల ఏమేరకు జరిగాయని సీఎం పరిశీలించనున్నారు. అధికారులు ఇందు కోసం ఏర్పాటు చకచకా చేశారు. తొలిత ర‌న్‌వేపై ఏర్పాటు చేస్తున్న‌ హెలీప్యాడ్ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్క‌డి నుంచి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్కు చేరుకొని వివిధ శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడనున్నారు.

 

ఇక్క‌డ ఫొటో ఎగ్జిబిష‌న్‌, విఐపి లాంజ్ ఏర్పాట్ల‌ చేశారు వీటిని సీఎం పరిశిలిస్తారు. వచ్చే వీఐపీలకు జెర్మ‌న్ హేంగ‌ర్ల‌తో ప‌టిష్ట‌మైన షెడ్ల‌నునిర్మించారు అక్కడే కాసేపు స్థానిక నాయకులతో సీఎం మాట్లాడనున్నారు. అనంత‌రం టెర్మిన‌ల్ భ‌వ‌నం వ‌ద్దకు చేరుకొని పనులపై అధికారులతోను జీఎంఆర్ ప్రతినిధులతోను స‌మీక్షించనున్నారు. అనంతరం విశాఖకు బయలుదేరనున్నారు. తొలిసారిగా ఉత్తరాంధ్ర వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలను పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద కట్టుదిట్టమైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ చేపట్టారు. కలెక్టర్ అంబేద్కర్ జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌తో భద్రత పై చ‌ర్చించారు.