ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్వన్ కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన అనంతరం వ్యవసాయంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు.
Also Read: CM Chandrababu: మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయండి!
‘రాష్ట్రానికి 41 శాతం ఆదాయం సేవారంగం నుంచి వస్తుంది. ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పశుసంపదపై 19 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి మరింత పెరగాలి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయం పెంచుతున్నాం. 157 గోకులాలు వస్తున్నాయి, పశువులకు హాస్టళ్లు తెస్తున్నాం. గోకులాలకు గడ్డి కూడా సరఫరా చేస్తాం. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. రాయలసీమలో హార్టీకల్చర్, మైక్రో ఇరిగేషన్ రావాలనేది నా ఆకాంక్ష. హార్టీకల్చర్లో 21 శాతం వృద్ధి రేటు సాధించాం. హార్టీకల్చర్ అభివృద్ధిపై మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రోత్సహిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు తీసుకున్నాం. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి మనం నెంబర్వన్ కావాలి’ అని సీఎం అన్నారు.