Chandrababu on Madanapalle Sub Collector Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై సీఎం కీలక వ్యాఖ్యలు..
- మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై స్పందించిన సీఎం..
- 22-ఏ సెక్షనులో అగ్ని ప్రమాదం జరిగింది..
- సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు..
- కావాలనే ఫైళ్లను తగులబెట్టారని అధికారులు చెప్పారన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu on Madanapalle Sub Collector Incident: సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై అసెంబ్లీలో స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అగ్నిప్రమాద ఘటనపై ఇప్పటికే వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ.. మరోసారి అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావించారు.. 22-ఏ సెక్షనులో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే స్పందించాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల కాదని అధికారులు చెప్పారు. కావాలనే ఫైళ్లను తగులబెట్టారని అధికారులు చెప్పారని సభలో ప్రకటించారు.
Read Also: Harish Rao: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..
Also Read
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Trisha: విజయ్ చిత్రం "జన నాయగన్"పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
ఇక, గతంలో యనమలకుదురు కట్ట మీద కూడా పీసీబీ ఫైళ్లను తగులబెట్టారు. ఏదో చూసీ చూడనట్టు పోతుంటే ఆధారాలు తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని పిలుపునిచ్చారు. మాచర్లకు ఐదేళ్ల పాటు మేం వెళ్లలేకపోయాం. కానీ, జగన్ వినుకొండకు వెళ్లాలని భావిస్తే మేమేం అడ్డుకోలేదని గుర్తుచేశారు.. గవర్నర్ను అడ్డుకోవాలని వైసీపీ భావించిందని దుయ్యబట్టారు.. ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. తప్పుడు ఆరోణలు చేస్తున్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, 36 మంది పేర్లు మాత్రం చెప్పడం లేదు. ఫేక్ రాజకీయాలను సహించమని హెచ్చరించారు చంద్రబాబు.. మరోవైపు.. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే రావణ కాష్టమే అవుతుంది.. తప్పు చేసిన వ్యక్తులను వదిలేదే లేదు.. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. ముఠాలను కంట్రోల్ చేశాం.. రాజకీయ నేతలే రౌడీలైతే రాజకీయాలు నేరమయం అవుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!