CM Chandrababu Nidadavolu visit: నిడదవోలులో సీఎం చంద్రబాబు పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Nidadavolu visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రజా వేదిక సమావేశం, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, పార్టీ కార్యకర్తల సమావేశం వంటి పలు కార్యక్రమాలతో సీఎం బిజీ షెడ్యూల్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11:00 గంటలకు నిడదవోలు పట్టణంలోని ఎం.వి నగర్ మారుతి లేఅవుట్ సమీపంలో ఉన్న St. Ambrose School వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలకనున్నారు.
Read Also: Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
Also Read
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
తర్వాత ఉదయం 11:15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11:20 గంటలకు సుబ్బారాజుపేట – సింగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమ స్థలానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1:15 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 గంటల మధ్య మలకోడు సరస్సు ప్రాంతానికి చేరుకుని అక్కడ నీటిమొక్కలు (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేయనున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలతో సీఎం పరస్పర చర్చలు జరపనున్నారు. తరువాత మధ్యాహ్నం 2:30 గంటలకు నిడదవోలు పట్టణంలోని సెయింట్ అంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నుంచి బయలుదేరి, సాయంత్రం 4:45 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిడదవోలులో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
-
Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..