Andhra Pradesh Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. వారికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
- నంద్యాల జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- అవినీతికి తావు లేకుండా పట్టాలు అందజేస్తామన్న సీఎం చంద్రబాబు..
- భూములపై హక్కులు ఉండేలా చూస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి రికార్డుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది రైతులకు భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్తబురుజు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న సీఎం.. రైతులకు క్యూఆర్ (QR) కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు ప్రయోజనాల దృష్ట్యా వివాదాస్పద ‘ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని’ రద్దు చేసినట్లు గుర్తు చేశారు.
Also Read:TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Also Read
- Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
- Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
- Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
- Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. భూ రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పక్కాగా పట్టాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో పాసుపుస్తకాల విషయంలో నెలకొన్న గందరగోళానికి స్వస్తి పలుకుతూ.. కొత్త టెక్నాలజీతో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనివల్ల రికార్డుల భద్రత పెరగడమే కాకుండా.. ఫోర్జరీకి అవకాశం ఉండదని తెలిపారు.
Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
ఒక్క పైసా కూడా అవినీతికి తావులేకుండా పట్టాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూ వివాదాలు , రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాతే కొత్త పాసుపుస్తకాలను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో జరిగిన తప్పుల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు జరగకుండా.. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
-
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
-
Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..