Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం గొడవ.. పెళ్లిలో ఇరువర్గాలు ఘర్షణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fight In Marriage: వివాహ వేడుకలో వింత ఘటన చోటుచేసుకుంది. ముక్క కోసం ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఈవార్త చేరడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. పెళ్లి విందు వివాదాస్పదంగా మారిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరులో చోటుచేసుకుంది.
వేములవాడకు చెందిన అబ్బాయితో ఆత్మకూరుకు చెందిన ఓ యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికూతురు ఇంట్లోనే అంగరంగ వైభవంగా వివాహం కూడా జరిగింది. పెళ్లికి హాజరైన వధువు బంధువులు, స్నేహితులందరికీ వధువు కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారు. మటన్ కర్రీ, బగరా రైస్ అతిథులకు వడ్డించడం వల్ల మర్యాదకు లోటు రాకుండా చేశారు. అయితే మద్యం మత్తులో కొందరు చేసిన గొడవ ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో భోజనానికి వచ్చిన పెళ్లికొడుకు బంధువులకు భోజనానికి సరిపడా మటన్ కూర అయిపోయిందని వధువు బంధువులు చెప్పడంతో మద్యం మత్తులో వరుడి బంధువులు గొడవకు దిగారు. వంట సామాగ్రి, టేబుళ్లను ఎత్తుకెళ్లి వడ్డిస్తున్న వారిపై దాడి చేశారు.
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Read also: Viral Video: వాటే క్రియేటివిటీ.. పానీ పూరిపై ఆర్టిస్ట్ కళాకృతి సూపర్..!
దీంతో వధూవరుల బంధువులు పరస్పరం గొడవపడగా, వధువు బంధువుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. పెళ్లి వేడుక రణరంగంగా మారింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మూడంచెల బంధంతో ఏడడుగులు వేసిన నవ వధువును వేములవాడకు పంపించారు. విందులో ఇరువర్గాలు ఘర్షణ పడడంతో మెట్ పల్లి పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. బాలిక బంధువు దుద్దుల తిరుపతి ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన బాలుడి బంధువులు ఏడుగురిపై, ఆత్మకూరుకు చెందిన బాలిక బంధువులు 9 మంది, వేములవాడకు చెందిన బాలుడి బంధువు నరవరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మద్యం మత్తులో గొడవపడి ఒకరినొకరు కొట్టుకుని కటకాలు లెక్కపెట్టే పరిస్థితి తలెత్తడంతో వధూవరుల తల్లిదండ్రులు రాజీ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా.. మొత్తానికి మద్యం మత్తులో మటన్ కోసం కొట్లాటకు దిగి గాయపడి.. పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు పడాల్సి వచ్చింది.
Pemmasani Chandrasekhar: వైసీపీపై పెమ్మసాని ఫైర్.. అది నిజమా? కాదా..?
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!