Pakistan : పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని కోర్టు వెలుపల పోలీసులు, లాయర్ల మధ్య బుధవారం జరిగిన హింసాత్మక ఘర్షణలో 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పోలీసులు 50 మంది న్యాయవాదులను అరెస్టు చేయగా, దీనికి వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ గురువారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీతో సంబంధమున్న న్యాయవాదులపై తీవ్రవాద కేసులు నమోదు చేయడం.. సబార్డినేట్ కోర్టును మరొక ప్రదేశానికి మార్చడంపై లాహోర్ హైకోర్టు (ఎల్హెచ్సి) బయట లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.
Read Also:Goa: గోవా సీఎం మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి సాయం
Also Read
- Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ఎల్ హెచ్ సీ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణతో మాల్ రోడ్డు యుద్ధభూమిగా మారింది. ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై లాఠీచార్జి చేసిన పోలీసులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పంజాబ్ పోలీసులు 50 మందికి పైగా న్యాయవాదులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వెంటనే, పంజాబ్ పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ బార్ కౌన్సిల్ గురువారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. ఈ ఘర్షణలో 22 మందికి పైగా లాయర్లు, పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా కనీసం 14 మంది పోలీసులు ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించామని లాహోర్ సీనియర్ పోలీసు అధికారి కమ్రాన్ ఫైసల్ తెలిపారు.
Read Also:India Maldives Tension: నేడు భారత్లో పర్యటించనున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి..
లాయర్లు మొదట పోలీసులపై రాళ్లు రువ్వారని, ప్రతిస్పందనగా వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్.. వాటర్ ఫిరంగిని ఉపయోగించారని ఫైసల్ పేర్కొన్నాడు. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగుతుండగా, లాయర్లపై బలప్రయోగాన్ని నివారించాలని పంజాబ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!