Yediyurappa: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. దర్యాప్తును సీఐడీకి అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) కర్ణాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలోని సీఐడీకి అప్పగించారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఎస్ యడ్యూరప్పపై ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన బెంగళూరుకు సంబంధించిన ఈ వ్యవహారంపై పోలీసు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 17 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో బీఎస్ యడియూరప్పపై పోక్సో, 354 (A) కింద కేసు నమోదైంది. అయితే కర్ణాటక డీఐజీ ఈ కేసును ఏడీజీపీ ఆధ్వర్యంలోని సీఐడీకి అప్పగించారు.
Read Also: Supreme Court: ఈవీఎంలపై ఆరోపణల పిటిషన్ విచారణ.. ఏం తేల్చిందంటే..!
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఫిర్యాదు ప్రకారం, ఆరోపించిన లైంగిక వేధింపు ఫిబ్రవరి 2న జరిగింది, ఒక మోసం కేసులో సహాయం కోరుతూ తల్లి, కుమార్తె యడ్యూరప్ప వద్దకు వెళ్లినప్పుడు. ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలు గది నుంచి బయటకు రాగానే తన తల్లికి జరిగిన వేధింపుల గురించి చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ విషయం వెలుగులోకి రావడంతో, యడ్యూరప్ప కార్యాలయం కొన్ని పత్రాలను విడుదల చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహిళ ఇప్పటి వరకు వేర్వేరు వ్యక్తులపై 53 కేసులు పెట్టినట్లు తెలిసింది.
Read Also: Tamota Price : భారీగా పెరుగుతున్న టమోటా ధరలు.. కిలో ఎంతంటే?
అదే సమయంలో, ‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, అయితే దీని వెనుక ఏదైనా రాజకీయ ఉద్దేశ్యం ఉందని నేను ఇప్పుడే చెప్పలేను’ అని యడియూరప్ప అన్నారు. ఈ విషయంపై యడ్యూరప్ప మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం మా ఇంటికి ఒక తల్లీ, కూతురు వచ్చారని చెప్పారు. వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. ఒకరోజు ఆమె కన్నీళ్లతో చూసి లోపలికి పిలిచి అడిగాను. తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పిందని అన్నారు. ఆ బాలిక తల్లి ఆరోగ్యం సరిగా లేదని తాను గ్రహించినట్లు, వారు నిజాలను వక్రీకరించారని యడ్యూరప్ప తెలిపారు. ఈ విషయంపై న్యాయపరంగా పోరాడుతామన్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం