CID Search Operation: రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ డిస్టలరీల్లో సీఐడీ తనిఖీలు
- రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు
- ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CID Search Operation: రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై సీఐడీ బృందాలు ఆరా తీస్తోంది. డిస్టలరీల నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా చేశారనే కోణంలో పరిశీలిస్తున్నారు. డిస్టలరీల యాజమాన్యం వెనుక బినామీలు ఉన్నారానే కోణంలో విచారణ జరుగుతోంది. 2014 – 2019 మధ్య కాలంలో టీడీపీ అనుమతులు ఇచ్చిన డిస్టలరీలను పలువురు వైసీపీ నేతలు చేజిక్కించున్నారనే ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. డిస్టలరీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్కు మాత్రమే కాకుండా అనధికార సరఫరాపై సీఐడీ ఫోకస్ పెట్టింది. రికార్డుల పరిశీలన, ఆధారాల సేకరణపై సీఐడీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Read Also: Minister Narayana: కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ భేటీ
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ డిస్టలరీలలో సీఐడీ తనిఖీలు చేపట్టింది. అనకాపల్లి జిల్లా కశింకోట(మం) సుందరయ్య పేట దగ్గర వున్న విశాఖ డిస్టలరీ, జీఎస్బీ డిస్టలరీలో రికార్డులను అధికారులు పరిశీలించారు. తలుపు మూసివేసి లోపలికి అనుమతించకుండా సోదాలు చేపట్టారు. 2019- 24 మధ్య తయారైన లిక్కర్ నాణ్యత పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల క్రితం ఎక్సైజ్ – సీఐడీతో జాయింట్ కమిటీలను ఏర్పాటు చేసింది. వివిధ డిస్టలరీలలో తయారైన మద్యం శాంపిల్స్ ను ఈ టీంలో సేకరించాయి. వీటికి సంబంధించిన కెమికల్ ఎనాలసిస్ రిపోర్టులు ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రికార్డుల తనిఖీలు కీలకంగా మారాయి. సుందరయ్యపేట డిస్టలరీలలో తయారయ్యే బ్రాండ్లు వైసీపీ ముఖ్య నేత కంపెనీకి చెందినవిగా టీడీపీ ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోదాలకు గల కారణాలను సీఐడీ కానీ ఎక్సైజ్ శాఖ కానీ నిర్ధారించడం లేదు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ డీకే పల్లి సమీపంలోని వ్యాంటేజీ డిస్లరీలో సీఐడీ అధికారులు తనిఖీలు జరిపారు. కడప నగర సమీపంలోని ఈగల్ డిస్టలరీస్లో నాలుగు బృందాలు తనిఖీలు చేశాయి. 9 సీ హార్స్ చీప్ లిక్కర్ తయారీ కంపెనీపై సీఐడీ సోదాలు చేపట్టింది. గత ఐదు సంవత్సరాలలో ఎంత తయారు చేశారు.. ఎంత ప్రభుత్వానికి సరఫరా చేశారు, అన్న రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కోటపాడు శివారు పీఎంకే డిస్టిలేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో కూడా సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని ఎస్వీఆర్ డిస్టిలరీస్పై దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగారయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని పెరల్ డిస్టిలరీని సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంటనీ బయోటెక్ కర్మాగారంలో మద్యం బాటిలింగ్ యూనిట్లో సీఐడీ అధికారుల సోదాలు జరిగాయి. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ను అధికారులు పరిశీలించారు.
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!